టీమిండియా సారధి విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్ ఒకానోక సందర్భంగా తనను క్షమించాలని, తనపై నిషేధం విధించరాదని కోరారు. ఔనా.? నిజమేనా.? ఎప్పుడు.. అని ఆలోచనలో పడ్డారా. కానీ ఇది నిజం. ఆ సంఘటనను తాజాగా విరాటుడు గుర్తుచేసుకున్నాడు. మధ్య వేలిని స్టేడియంలో ప్రేక్షకుల వైపు చూపించి కెమెరాలకు దొరికిపోయిన వైనాన్ని పంచుకున్నాడు. విజ్డన్ క్రికెట్ మాస పత్రికతో కోహ్లీ మాట్లాడుతూ 2012లో సిడ్నీ టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న వివాదం గురించి వివరించాడు.
టీమిండియా 2012లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. రెండో టెస్టు సిడ్నీలో జరిగింది. ఈ మ్యాచులో స్టేడియంలో స్థానిక ప్రేక్షకుల ప్రవర్తనతో చిరాకుపడ్డ కోహ్లీ ఓ దశలో వారివైపు మధ్య వేలిని చూపించి తన కోపాన్ని ప్రదర్శించాడు. విరాట్ ప్రవర్తను గమనించిన మ్యాచ్ రిఫరీ రంజన్ అతన్ని తర్వాతి రోజు తన గదికి రావాల్సిందిగా ఆదేశించాడు. దీంతో కోహ్లీ అక్కడికి వెళ్లాడు. ‘నిన్న బౌండరీ లైన్ వద్ద ఏం జరిగింది? అని రిఫరీ ప్రశ్నించాడు. దీనికి నేను ఏం జరగలేదు అని చెప్పేసరికి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ ను నా ముందుకు విసిరేశాడు.
అందులో నేను మధ్య వేలిని చూపిస్తున్న ఫొటో ఉంది. వెంటనే నన్ను క్షమించండి.. నాపై నిషేధం విధించకండి అంటూ వేడుకున్నా. అతను మంచి వ్యక్తి. యుక్త వయస్సులో ఇవన్నీ సహజం అనుకొని నన్ను అర్థం చేసుకున్నాడు’ అని కోహ్లీ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత కోహ్లీ ఈ ఘటనకు సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశాడు. ‘క్రికెటర్లు అలా ప్రవర్తించొద్దన్న నియమాన్ని అంగీకరిస్తాను. అయితే ఆ గుంపులోంచి మన అమ్మ, సోదరి గురించి చెడుగా మాట్లాడితే ఏం చేయాలి? చాలా ఘోరమైన మాటలు విన్నా’ అంటూ ట్వీట్ పెట్టాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more