ఇంగ్లాండ్ తో జరిగిన రెండు పరిమిత ఓవర్ల సిరీస్ లలో ఒకదానిలో గెలిచి మరోటి ఓటమిపాలైన నేపథ్యంలో బిసిసిఐ అచితూచి అత్యంత కీలకమైన టెస్టు సిరీస్ కు మాత్రం ఆటగాళ్ల ఎంపికలో తీవ్ర కసరత్తే చేసింది. ఇవాళ ఇంగ్లాండ్ తో తలపడే టెస్టు స్వాడ్ ను ప్రకటించిన బీసీసీఐ.. టీ20లలో పంబరేపి.. వన్డేలో చతికిలపడిన రోహిత్ శర్మను పక్కనబెట్టింది. గతంలో కూడా రోహిత్ శర్మ టెస్టుల్లో పెద్దగా రాణించకపోవడంతో.. బీసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా రిషబ్ పంత్ కు తొలిసారిగా టెస్టు మ్యాచ్ లలో పిలుపు అందింది.
ఆగస్టు 1 నుంచి టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడు టెస్టుల్లో తలపడే టీమిండియాను బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 18 మంది సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. యో యో టెస్టు ఫెయిలై అఫ్గానిస్థాన్ తో ఏకైక టెస్టుకు దూరమైన మహమ్మద్ షమి ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం నుంచి కోలుకోని సాహాకు చోటు దక్కలేదు. అలాగే వెన్నునొప్పితో బాధపడుతోన్న భువనేశ్వర్ కూడా మూడు టెస్టులకు దూరమయ్యాడు. వికెట్ కీపర్లుగా దినేశ్ కార్తీక్, రిషప్ పంత్కు చోటు దక్కింది.
తన మాయాజాలంతో ప్రత్యర్థుల వికెట్లను తన ఖాతాలోకి వేసుకుంటూ టీ20, వన్డే సిరీస్ లో రాణించిన మణికట్టు స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. అయితే మొత్తంగా 18 మంది పేర్లను బిసిసిఐ ప్రకటించినా.. తుది జట్టులో అడే 11 మంది ఎవరన్నది.. తెలుసుకోవాలంటూ వేచి చూడాల్సిందే. వన్డే సిరీస్ కోల్పోయిన ఇండియా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుని చరిత్రను తిరగరాస్తూ ఇంటికి చేరుకుంటుందని భారత క్రీడాభిమానులు భావిస్తున్నారు.
భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, రహానె(వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, దినేశ్కార్తీక్(వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more