భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా.? రానున్న ప్రపంచ కప్ వరకు అడటానికి తాను అన్ని రకాలుగా ఫిట్ గా వున్నానని మాటల్లోనే కాక.. అటు యువ క్రీడాకారులతో సమానాంగా పరుగెత్తి చేతల్లోనూ సవాల్ విసిరన ధోని.. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు తలొగ్గి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా.? అన్న అసక్తికర ప్రశ్నలు ఇప్పుడు టీమిండియా క్రికెట్ అభిమానులతో పాటు ధోని అభిమానులను కలవరపరుస్తున్నాయి.
ఇంగ్లాండ్ తో లీడ్స్ లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలవ్వడంతొ వన్డే సిరీస్ ను 2-1 తేడాతో అతిధ్యజట్టు సొంతం చేసుకుంది. కీలకమైన మ్యాచ్లో భారత్ పేలవ ప్రదర్శనతో నిరాశపర్చింది. పరుగులు చేయడంలో మిడిలార్డర్ మరోసారి విఫలం కాగా.. ధోనీ క్రీజులో నిలబడి పోరాడినా.. దూకుడుగా ఆడలేకపోయాడని అభిమానులు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను పక్కనబెడితే మ్యాచ్ ముగిసిన తరువాత ధోని అంపైర్ల నుంచి బంతిని తీసుకున్నాడు. దీంతో ధోనీ త్వరలోనే క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడనే రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అందుకు కారణం కూడా లేకపోలేదు. సరిగ్గా టెస్టుల నుంచి రిటైరయ్యే సమయంలోనూ ధోనీ ఇలాగే ప్రవర్తించాడు. 2014లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ ఆడిన ధోనీ.. మ్యాచ్ ముగిశాక.. స్టంప్ లను తనతో తీసుకెళ్లాడు. ఆటగాళ్లు గెలిచిన ఆనందంలో లేదా గుర్తుగా మాత్రమే ఇలా స్టంప్ లను తీసుకెళ్తారు. ఆసీస్ తో మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ ధోనీ స్టంప్ లను తీసుకెళ్లాడు. తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ తో మ్యాచ్ ముగిశాక ధోనీ అంపైర్ దగ్గర్నుంచి బంతిని అడిగి తీసుకుంటోన్న వీడియో వైరల్గా మారింది. అభిమానులను కలవరపరిచే నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించకపోతే మంచిదని అంటున్నారు అభిమానులు
Here's the video of the MS Dhoni taking the ball from umpires after the game. #ENGvIND pic.twitter.com/C14FwhCwfq
— Sai Kishore (@KSKishore537) July 17, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more