భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో అజింక్యా రహానే బదులు మరో అటగాడిని తీసుకోవడానికి కారణాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మీడియా ఎదుట వివరించాడు. అయితే అజ్యింక రహానే పేరు లేకపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన రహానే స్థానంలో రోహిత్ శర్మను తీసుకోవడంపై కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ పై సెలక్టర్లు నమ్మకం ఉంచినప్పటికీ అతడు మాత్రం తొలి టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 11, రెండో ఇన్నింగ్స్లో 10 పరుగులు చేశాడు.
తొలి టెస్టులో 72 పరుగుల తేడాతో పరాజయం పాలైన తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ రోహిత్ శర్మను తీసుకోవడం వెనక ఉన్న కారణాన్ని బయటపెట్టాడు. కోహ్లీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రస్తుతం ఉన్న ఫామ్ ను పరిగణనలోకి తీసుకుని రహానే బదులు రోహిత్ శర్మను తీసుకున్నట్టు చెప్పాడు. రోహిత్ ఇటీవల ఆడిన మూడు టెస్టుల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడని ప్రశంసించాడు. రోహిత్ చేసిన పరుగులను ప్రమాణంగా తీసుకునే అతడిని ఎంపిక చేశామని చెప్పుకొచ్చాడు.
నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికా టూర్లో రహానే బాగా రాణించాడు. 209 పరుగులతో ఆ టూర్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 272, చతేశ్వర్ పుజారా 280 పరుగులు చేశారు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విధించిన 208 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా 72 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్లో హార్ధిక్ పాండ్యా ఒక్కడే 93 పరుగులతో ఆకట్టుకున్నా మరెవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more