నూతన కాంట్రాక్ట్ వివాదానంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో వూర్తిగా విఫలమైన క్రికెట్ అస్ట్రేలియా (సీఏ)పై ఆ దేశ క్రికెటర్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిప్పులు చెరిగారు. సీఏ తన తప్పులను లెక్కపెట్టకుండా ఆటగాళ్లను నిందించడం సరికాదని మండిపడ్డాడు.. ఈ వివాదం పరిష్కరించకపొతే ఆగష్టులో బంగ్లదేశ్ పర్యటనకు ముప్పు వాటిల్లుతుందని వార్నర్ హెచ్చరించాడు. కాంట్రాక్టు ఒప్పందాన్ని పరిస్కరించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు అటగాళ్లు సహకరించడం లేదని క్రికెట్ అస్ట్రేలియా ఆరోపించింది. దీనికి వార్నర్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో ఘాటుగా స్పందించాడు.
ఆస్ట్రేలియా పురుషులు, మహిళా క్రికెటర్లందరూ దేశం తరుపున ఆడాలని ఉన్నా.. క్రికెట్ అస్ట్రేలియా మాత్రం సమస్యకు పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. అయితే తమ మానన తాముంటే.. తమపై సీఏ నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 30 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ప్రతిపాదించిందని దీనికి సీఏ అంగీకరించకుండా సంక్షోభం ముదిరేలా చేసిందని వార్నర్ పేర్కొన్నాడు. వివాదం పరిష్కారం కాక క్రికెటర్లంతా నిరుద్యోగులయ్యారని, ఆర్ధిక పరిస్థితులతో సతమతమవుతున్న క్రికెట్లో కొనసాగుతున్నారని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్మినిస్టేటర్లకు మాత్రం డబ్బుల ముట్టాయని.. వారికి ఎలాంటి దిగులు లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. గత జూన్లో క్రికెటర్లకు సీఏకు కాంట్రాక్టు ఒప్పందం ముగియడంతో 230 మంది క్రికెటర్లు నిరుద్యోగులుగా మారారని అయినా సీఏకు మాత్రం ఏమీ పట్టడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదం పరిష్కారం కాకపోతే నవంబరులో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రమాదంలో పడునుంది. ఇప్పటికే కొంత మంది ప్లేయర్లు ఇతర దేశాల్లో జరిగే టీ-20 లీగ్ లు ఆడుతున్నారని వార్నర్ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more