అస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్ లో వీరవిహారం చేసి.. 21తో నెగ్గిన టీమిండియాకు బిసిసిఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ నజరానా పై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాటర్ లోకి ఎంటైర్ అయితే.. గత నెలలో టీమిండియా క్రికెట్ ఆటగాళ్ల వేతనాలను రెట్టింపు చేస్తూ, మూడు విభాగాల్లో ఆటగాళ్లను వర్గీకరిస్తూ, రూ. 2 కోట్లు, రూ. 1 కోటి, రూ. 50 లక్షలు ఇచ్చేలా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై విరాటుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.
టీమిండియా ఆటగాళ్లు పోందుతున్న ఫీజులను విదేశీ ఆటగాళ్ల ఫీజులతో పోలిస్తే, ఏ మూలకు సరిపోవడం లేదని అన్నారు. బీసిసిఐ ఇస్తున్న ఫీజులు చాలా తక్కువని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉందని అన్నాడు. టెస్టు మ్యాచ్ కి రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ-20కి రూ. 3 లక్షలు ఇచ్చేలా పాత ఫీజులను పెంచుతూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయమూ తృప్తిగా లేదని అన్నాడు. భారత జట్టు మాజీ మేనేజర్ రవిశాస్త్రి ఈ విషయమై స్పందిస్తూ.. ఆటగాళ్లకు వేరుసెనగ పప్పులు ఇచ్చినట్లు బీసిసిఐ వేతనాలు ఇస్తుందని విమర్శించారు.
ఆ మరుసటి రోజునే కోహ్లీ ఈ విషయమై స్పందిస్తూ.. తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెటర్లు సాలీనా రూ. 10 నుంచి రూ. 12 కోట్లు సంపాదిస్తున్నారని, ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో పోలిస్తే, బలంగా ఉన్న బీసీసీఐ, అందులో సగం కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. ఏ గ్రేడ్ ఆటగాడికి రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ లో రూ. 3 కోట్లు, సీ గ్రేడ్ లో రూ. 1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కోహ్లీ అభిప్రాయాలతో కోచ్ అనిల్ కుంబ్లే సైతం ఏకీభవించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more