క్రికెట్ లో బద్ద శత్రువులు ఎవరూ వుండరు. ఎంతటి దాయాదులతో మ్యాచ్ జరుగుతున్నా.. ఫీల్డ్ లో వున్నంత వరకే వైరం. ఆట ముగిసీముగియగానే అందరూ ఒక్కటే. గ్రౌండ్ లో ఒకరి వ్యూహాలను మరొకరు తిప్పికోట్టాలని ప్రయత్నిస్తూనే వుంటారు. ఈ క్రమంలో కొంత స్లెడ్జింగ్ కు కూడా అవకాశముంది. ఈ విద్యను కూడా ఫీల్డ్ లోకి తీసుకువచ్చింది మాత్రం అస్ట్రేలియానే. అండ్రై సైమండ్స్, హర్భజన్ సింగ్ మధ్య తలెత్తిన మంకీ గేట్ అంశమే కానీ లేక అంతకు ముందు ఏదేని తీసుకున్నా.. మనకు అసీస్ కు మధ్య మ్యాచ్ జరుగుతుందంటే అక్కడ వివాదాలు ఖచ్చితంగా పుట్టుకోస్తాయి.
అయితే ఈ విషయాలను అటగాళ్లు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. కానీ ఆస్ట్రేలియా జట్టు మాజీ క్రికెటర్ ఎడ్ కోవాన్ మాత్రం తాను విరాట్ కోహ్లీని వికెట్ తీసుకుని పోడిచేద్దమానుకున్నాని తన మనస్సులో మాటను బయటపెట్టాడు. అయితే అలా జరగకుండా అపడంలో అపైర్లు ఒకింత దోహదపడితే.. తనకు స్వతహాగా విరాట్ కోహ్లీపైనున్న అభిమానం కూడా కొంతవరకు అలా జరగకుండా కాపాడిందని చెప్పుకోచ్చాడు. విజయం సాధతో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై పలువురు ఆ దేశ మాజీ ఆటగాళ్లు, అక్కడి మీడియా తీవ్ర స్థాయిలో తమ అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంచితే విరాట్ ను ఒకానొక సమయంలో స్టంప్ తో పొడుద్దామనుకున్నాడట ఆసీస్ మాజీ క్రికెటర్ ఎడ్ కోవాన్. గతంలో జరిగిన ఓ టెస్టుమ్యాచ్ లో తన పట్ల విరాట్ అనుచితంగా వ్యవహరించాడని, తీవ్రమైన బూతును తిట్టాడని అయితే తనకు ఆ బూతు ఏంటో అర్థంకాకపోయినా.. అది తీవ్రమైన పదమేనని మాత్రం అర్థమైందన్నాడు. అ సమయంలో తాను కోహ్లీని వికెట్ తీసుకుని పోడుద్దామనుకున్నానని చెప్పాడు. అయితే ఆ వివాదం ఎప్పుడు జరిగిందన్న విషయంలో మాత్రం కోవాన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా, అసీస్ జట్టుకు దూరమై నాలుగేళ్లు కావస్తున్నా.. మళ్లీ జట్టులో స్థానం లభించకే కోవాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more