ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఆరంభపు ట్వంటీ 20 మ్యాచ్లో భారత మహిళలు చెలరేగిపోయారు. బంగ్లాదేశ్ మహిళల్ని 54 పరుగులకే కూల్చేసి 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.భారత క్రీడాకారిణుల్లో మిథాలీ రాజ్(49) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోగా, స్మృతీ మందనా(41) ఆకట్టుకుంది. ఈ జోడి తొలి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత్ ను పటిష్ట స్థితికి తీసుకెళ్లింది. కాగా, ఆ తరువాత హర్మన్ ప్రీత్ కౌర్(19) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరుకే పరిమితమైంది.
అయితే ఆపై 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 13 పరుగుకే మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది.కాగా, సల్మా ఖాతున్(17), షాలియా షర్మిన్(18) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో బంగ్లాదేశ్ 50 పరుగుల మార్కును దాటింది. వీరిద్దరూ అవుటైన తరువాత బంగ్లా కథ మళ్లీ మొదటికొచ్చింది. కనీసం క్రీజ్లో నిలుచునే ప్రయత్నం చేయకుండానే బంగ్లా క్రీడాకారిణులు క్యూకట్టేశారు. భారత మహిళల్లో పూనమ్ యాదవ్ మూడు వికెట్లు, గోస్వామి, అనుజా పాటిల్ తలో రెండు వికెట్లు సాధించారు. మన్షీ జోషి, ఏక్తా బిస్త్లకు చెరో వికెట్ దక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more