పర్యాటక జట్టు ఇంగ్లాండ్ తో మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఇవాళ ప్రారంభమైన టెస్టులో తొలిరోజున పర్యాటక జట్టుపై టీమిండియా అద్యంతం పైచేయి సాధించింది. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ జట్టులో బెయిర్ స్టో, బట్లర్ రాణించడంతో దౌరవప్రదమైన స్కోరును సాధించారు. వీరిద్దరు మినహా పర్యాటక జట్టులో మిగతా అటగాళ్లు భారత బౌలర్ల ధాటికి వెనుదిరగాల్సి వచ్చింది.
పేసర్లకు అనుకూలించే పిచ్ పై స్పిన్నర్లు కూడా రాణించడంతో తొలిరోజు ఆటలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఆదిలో తడబడింది. ఓపెనర్ హమీద్ (9) విఫలమయ్యాడు, అనంతరం వచ్చిన జో రూట్ (15) కూడా ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో తడబడ్డ ఓపెనర్, కెప్టన్ కుక్ (27) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో నిలదొక్కుకున్నాడు. అనంతరం వచ్చిన మొయిన్ అలీ (16) విఫలమయ్యాడు.
దీంతో బెన్ స్టోక్స్ (29) కూడా స్ట్రోక్స్ ఆడలేక పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ (43) నిలదొక్కుకోవడంతో బెయిర్ స్టో (89) ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. ఈ ఇద్దరూ భారీ స్కోరు దిశగా సాగుతున్న దశలో మరోసారి జట్టు కుదుపుకులోనైంది. వీరిద్దరూ ఔటవడంతో వోక్స్ (25) ఏకాగ్రత చెదిరి పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులో రషీద్ (4), బెట్టీ (0) క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్ చెరి రెండు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్, షమి చెరో వికెట్ తీసి వారికి సహకరించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more