వరల్డ్ టీ 20లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక పరుగు తేడాతో గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకున్న టీమిండియా.. సెమీస్కు చేరాలంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు మరో ముందుడుగు వేసి సెమీస్ లోకి వెళ్లాలంటే అసీన్ ను చిత్త చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి బంతి వరకు విజయం దోబుచులాడింది. అయితే అనుభవం, చతురత రెండింటినీ మేళవించి పాండ్యాతో బాలింగ్ చేయించిన ధోని చివరి బంతికి రనౌట్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
అయితే అసీస్ తో జరిగే మ్యాచ్ ఇందుకు పూర్తి భిన్నంగా వుంటుంది. ఒత్తిళ్లను జయించడం, వికెట్లు కోల్పోతున్న స్కోరుబోర్డును పరుగులెత్తించడం అసీస్ కు అలవాడు. అంతేకాదు టీమిండియా గర్వంగా చెప్పుకుంటున్నట్లు లాస్ట్ బాట్స్ మెన్ వరకు అసిస్ జట్టులోనూ నిలదోక్కకుని భారీ షాట్లు కోట్టే సత్తా వున్న బ్యాట్స్ మెన్లు వున్నారు. పాకిస్తాన్ తో జరిగనున్న మ్యాచ్ అసీస్ గెలిస్తే.. ఆ జట్టును ఓడించక తప్పని పరిస్థితి టీమిండియా ఎదుట వుంది.
అదే పాకిస్థాన్ గెలిచి ఆ తరువాత భారత్పై ఆసీస్ గెలిస్తే మాత్రం ఈ మూడు జట్లు తలో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించినట్లువుతుంది. అప్పుడు నాకౌట్ సమీకరణాలకు నెట్ రన్ రేట్ పైనే ఆధారపడాలి. అయితే ప్రస్తుత భారత్ నెట్ రన్రేట్ (-0.546) ఆందోళనకరంగా ఉండగా, పాకిస్తాన్ రన్ రేట్ (+0.254), ఆస్ట్రేలియా రన్ రేట్(+0.108)లు ముందంజలో ఉన్నాయి. భారత్ గెలిచిన రెండు మ్యాచ్లతో పాటు, నెట్ రన్ రేట్ను చూస్తే మన జట్టు సెమీస్ కు చేరడం కష్టమే. వీటితో సంబంధం లేకుండా ధోని సేన సెమీ ఫైనల్ కు చేరాలంటే కచ్చితంగా ఆసీస్పై మ్యాచ్ను గెలవడం ఒక్కటే మార్గం.
ఇదిలా ఉండగా వరల్డ్ టీ 20లో టీమిండియా ఇంకా పూర్తిగా గాడిలో పడలేదనే చెప్పాలి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన ట్వంటీ 20 సిరీస్ను, ఆ తరువాత స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ను, బంగ్లాదేశ్లో జరిగిన ఆసియాకప్ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన భారత్.. వరల్డ్ టీ 20 వచ్చేసరికి మాత్రం జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదు. ఈ టోర్నీలో న్యూజిలాండ్తో ఓటమి అనంతరం భారత్ సాధించిన రెండు విజయాలు జట్టు స్థాయి కన్నా తక్కువగానే వున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతూనే వున్నాయి
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more