ఐపీఎల్ సీజన్ -6 కోసం యాజమాన్యాన్ని, జట్టు పేరును మార్చుకొని ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన హైదరాబాద్ జట్టు బెంగుళూరుకు షాకివ్వడమే కాకుండా అందర్ని ఆశ్చర్య పరుస్తూ ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. నిన్న రాత్రి తన సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ కు అర్హత సాధించడమే కాకుండా, పాయింట్ల పరంగా నాలుగో స్థానంలో నిలిచి మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ పోరుకు సిద్ధమైంది. గంభీర్ సారధ్యంలోని డిపెండింగ్ ఛాంపియన్ అయిన కోల్ కత్తా మరో ఓటమిని మూట గట్టుకొని పాయింట్ల పరంగా ఏడో స్థానంలో నిలిచింది. మరోవైపు కలిసివచ్చిన ఉప్పల్లో రైజర్స్కు వరుసగా లభించిన రెండో విజయం, మొత్తంమీద ఈ ఐపిఎల్లో ఏడవది. ఇక్కడ 8 మ్యాచ్లు ఆడితే, చెన్నైతో జరిగిన ఒకే ఒక మ్యాచ్లో ఓడిపోయినా ఈ సీజన్ లో హైదరాబాద్ అభిమానులకు మంచి వినోదాన్ని పంచింది.
ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన రైడర్స్ 25 పరుగుల స్కోరుకే ఓపెనర్ బిస్లా (15)ను కొల్పోయింది. ఎనిమిదో ఓవర్లో కెప్టెన్ గంభీర్ సైతం స్వల్ప స్కోరుకే తిరిగి వచ్చాడు. 10 పరుగులే చేసిన గంభీర్ ఓ సింగిల్ రన్ తీయడానికి ప్రయత్నించిన దశలో రైజర్స్ అద్వితీయమైన ఫీల్డింగ్ ప్రదర్శించి రనౌట్చేసింది. ఆపై 50 పరుగులను దాటిన కొద్దిసేపటిలోనే కరణ్ శర్మ మూడో వికెట్ను కూల్చాడు. 11 వ ఓవర్లో మోర్గాన్ (9) స్టెఅతడికి ట్రాప్ అయ్యాడు. ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ 29 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు చేసి జట్టుకు ఆ మాత్రం స్కోరు అందించాడు. సన్రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. స్టెయిన్ రెండు వికెట్లు పడగొట్టగా మిశ్రా, కరణ్, పెరెరలకు తలోవికెట్ దక్కింది.
అనంతరం 131 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రైజర్స్ ఓపెనర్లు .పార్థివ్ (47) 37 బంతుల్లో ఏడు ఫోర్లు తరలించగా, ధావన్ (42 , 35 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లు) తో 89 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. గంభీర్ అదేపనిగా బౌలర్లను మార్చినా ఫలితం దక్కలేదు, చివరకు అబ్దుల్లా , తొలుత ధావన్ను ఆపై పార్థివ్ను అవుట్ చేశాడు.కానీ ఆప్పటకే రైడర్స్ గెలుపుకు చేరువలోకి వచ్చింది. 14వ ఓవర్లో 100 స్కోర్ను అందుకున్న వెంటనే పార్థివ్ అవుటయ్యాడు. తర్వాత 12 పరుగుల తేడాతో మూడు వికెట్లు కొల్పోయి రైజర్స్ కొంత కష్టాల్లో పడినప్పటికీ, సామి చెలరేగి ఇంకా బంతులు మిగిలి ఉండగానే గెలిపించాడు. 12 బంతుల్లో 2 భారీ సిక్సర్లను తరలించి రైజర్స్ను ప్లే ఆఫ్ చేర్చాడు. పార్థివ్ పటేల్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more