హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు మరో అద్బుత విజయం సాధించింది. సొంత మైదానం సెంటిమెటు బాగా కలిసి వచ్చింది. తక్కువ స్కోరు చేసినా, బౌలింగ్ లో రాణించి ప్లే ఆఫ్ కు మరింత చేరువైంది. నిన్న రాజస్థాన్ రాయల్స్ లో జరిగిన మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో విఫలం అయినా, ప్రధాన బలం అయిన బౌలింగ్ లో సత్తాసాటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు ప్రేక్షకులు సీట్లలో సర్దుకోక ముందే తొలి ఆరు ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. స్టేడియంలోకి వచ్చిన ప్రేక్షకులు ఈసారి కూడా హైదరాబాద్ తన సొంత మైదానంలో ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ సమంత్రై అద్భుత బ్యాటింగ్తో ఒంటిరి పోరాటం చేసి వ్యక్తిగత (55) పరుగులు, విహారీ (19), నమోదు చేసి జట్టును గౌరవప్రదమైన స్థానానికి (136) చేర్చారు. మిగతా బ్యాట్స్ మెన్ప్ ఇలా వచ్చి అలా వెళ్లి పోవడంతో భారీ స్కోరును సాధించడంలో విఫలం అయింది. ఇప్పటికే ప్లేఆఫ్ లో బెర్త్ ఖాయం చేసుకున్న రాజస్థాన్ మంచి ఊపులో ఉండటంతో విజయం సునాయాసమే అనుకున్నారు. రాజస్థాన్కు ఓపెనర్లు రాహుల్ ద్రవిడ్ (25), రహనే (12) శుభారంభాన్నే ఇచ్చారు కానీ మిడిలార్డర్లో వాట్సన్ (11), ఆఖరులో కూపర్ (26) మినహా మిగతా వారంతా పదిలోపు పరుగులకే పరిమితం కావడంతో లక్ష్యాన్ని చేరుకోవడం రాయల్స్కు పెద్ద కష్టంగా మారింది. సమస్టిగా రాణించిన హైదరాబాద్ బౌలర్లు స్టెయిన్, కరణ్ శర్మ, అమిత్ మిశ్రా, పెరెరా (చెరో రెండు వికెట్లు) ఇలా అందరూ సమానంగానే వికెట్లు పడగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ఎదుర్కొన్న రాయల్స్ 113 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. దీంతో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. అసలే ఫిక్సింగ్ ఆపరోపణల్లో రాజస్థాన్ జట్టుకు ఈ ఓటమితో మరో దెబ్బ తగిలినట్లైయింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more