భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన విండీస్ జట్టు కాన్పూర్ వన్డేలో మాత్రం గెలవలేక పోయింది. నేడు జరిగిన మూడో వన్డేలో భారత్ విండీస్ పై ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది ధోనీ సేన.
నేడు జరిగిన డే మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. గాయం కారణంగా మ్యాచ్ కి దూరంగా ఉన్న గేల్ స్థానంలో వచ్చిన చార్లస్ తక్కువ పరుగులకే అవుటయ్యినా, పావెల్ 70, శామ్యూల్స్ 71, డిఎం 51 (నాటౌట్), సిమ్మన్స్ 13, డీజె బ్రావో 4 సమి 37 (నాటౌట్ ) తో విండీస్ కి గౌరవ ప్రదమైన స్కోరు అందించింది.
264 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆదిలో కోహ్లీ, రోహిత్ శర్మల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు అనిపించినా, శిఖర్ ధావన్ 119 పరుగులు మెరుపు సెంచరీతో, యువరాజ్ సింగ్ 55 లు కలిసి 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ విజయానికి బాటలు వేశారు.
ఇటీవల కాలంలో నిలకడగా భారత ఓపెనర్ శిఖర్ రాణిస్తేనే.. భారత్ భారీ లక్ష్యాలని సైతం సునాయాసంగా చేధిస్తుంది. సెహ్వగ్ తర్వాత అదే దూకుడును ప్రదర్శిస్తూ..ప్రత్యర్థి ఆటగాళ్లకు ప్రమాధకరంగా మారాడు. ఆ తరువాత వచ్చిన రైనా(34) కూడా ధాటిగా ఆడి అవుట్ అయ్యాడు. చివర్లో ధోని జడేజాలు కలిసి మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ని ముగించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు శిఖర్ ధావన్ కి దక్కింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more
Nov 25 | వైజాగ్ క్రికెట్ స్టేడియం భారత జట్టుకు అచ్చొచ్చిన స్టేడియం. ఇంత వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ రికార్డుతో భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే... Read more