జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి నిరాశ కల్గిస్తూ భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ నేడు ప్రకటించింది. జట్టులో ఫాం లేని కారణంగా స్థానం కోల్పోయిన గంభీర్, సెహ్వాగ్ లకు మళ్ళీ మొండిచేయి చూపిస్తూ.... సీనియర్ ఫాస్ట్ బౌలర్ అయిన జహీర్ ఖాన్ కి మళ్ళీ పిలుపందించారు.ఇక ఎప్పటి నుండో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న తెలుగు తేజం అంబటి రాయుడుకి తొలిసారి టెస్టు జట్టులో స్థానం కలిప్పించారు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రాయుడు ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం సంపాదించాడు. 27 ఏళ్ల 10 నెలల వయసులో భారత్ తరఫున మొదటి అవకాశం దక్కింది. ధోనీ సేన వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
టెస్టు జట్టు
మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్య రహానే, అంబటి రాయుడు, వృద్ధిమాన్ సాహా, జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అశ్విన్, రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజా.
వన్డే జట్టు
మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రహానే, అశ్విన్ భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అశ్విన్, రవీంద్ర జడేజా, షమి, ప్రజ్ఞాన్ ఓజా, మోహిత్ శర్మ
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | వైజాగ్ క్రికెట్ స్టేడియం భారత జట్టుకు అచ్చొచ్చిన స్టేడియం. ఇంత వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ రికార్డుతో భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే... Read more