ఐదేళ్ల క్రితం తీవ్ర దుమారం రేపిన 'చెంపదెబ్బ' వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఐపీఎల్ తొలి అంచె పోటీల సందర్భంగా జరిగిన ఈ ఘటనకు మూలకారణమైన హర్భజన్ సింగ్ను 'వెన్నుపోటు దారు' అంటూ తాజాగా మరో వివాదానికి తె రలేపాడు శ్రీశాంత్. అప్పుడు జరిగిన ఈ సంఘటన అనుకోకుండా చోటుచేసుకుంది కాదని అదంతా ఓ ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఈ కేరళ స్పీడ్స్టర్ ఆరోపించాడు. కెరీర్లో విజయాలకంటే వివాదాలతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన శ్రీ.. అప్పటి సంఘటనపై ట్విట్లర్లో వరుస ట్వీట్లు చేశాడు. 'అప్పట్లో నేనేమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అందరికీ వాస్తవమేంటో తెలియాలి. భజ్జీ నన్ను చెంపదెబ్బ కొట్టలేదు. అయితే నేను ఉద్వేగంతో ఏడ్చినందుకు అంతా నన్ను నిందించారు. కానీ, కొట్టలేదని మీరంతా నమ్ముతున్న వ్యక్తి (భజ్జీ) వెన్నుపోటుదారు' అని ట్వి ట్టర్లో పేర్కొన్నాడు.
ఈ వ్యవహారంపై భజ్జీ బాధపడాలనేది తన ఉద్దేశం కాదని, అప్పుడేం జరిగిందో అందరికీ తెలియాలనే ఇలా చెబుతున్నానని అన్నా డు. 'వాస్తవమేమిటో ప్రపంచానికి తెలియాలని అనుకుంటున్నా. భజ్జీ నన్ను చెంపదెబ్బ కొట్టారని అంతా అనుకుంటున్నారు. కానీ అంతకన్నా ఎక్కువే జరిగింది. మ్యాచ్ అనంతరం షేక్హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లాం. నన్ను కొట్టేందుకు భజ్జీ ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు. తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ నన్ను మోచేతితో కొట్టాడు. అతడా సమయంలో కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. ఇందులో నా తప్పేమీ లేదు. కానీ నిజా నిజాలు తెలుసుకోకుండా అందరూ నన్నే నిందించారు. అయితే నిజం ఏమిటో తెలిపే వీడియో ఐపీఎల్ యాజమాన్యం దగ్గర వుంది' అని చెప్పాడు. ఐపీఎల్లోగానీ, క్రికెట్లోగానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని శ్రీ అన్నాడు. ఇప్పుడీ విషయాన్ని లేవనెత్తడం సమంజసం కాదన్న విషయం తెలుసనీ అయితే ఒక్క నిమిషం తన స్థానంలో ఉండి ఆలోచించాలని శ్రీ వేడుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more