ఒక వ్యక్తి హైదరాబాద్లోని ఐదు ఎకరాల స్థలం కొని ప్లాట్లు చేసి అమ్ముతుండగా అందులో ఓ 400 గజాల స్థలం కొని ఇంటి నిర్మాణం కోసం దానిని చుట్టూ ప్రహరీ కట్టించుకొన్నాను. దీనికోసం కరెంటు బిల్లు, వాటర్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. ఈ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు స్థానిక రెవెన్యూ అధికారి... ఈ ఐదెకరాల భూమి ఆర్వోఆర్ ప్రొసీడింగ్స్, పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ను ఎందుకు రద్దు చేయకూడదో పదిరోజులలో వివరణ ఇవ్వాలనీ, లేని పక్షంలో భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నోటీస్ జారీ చేశారు. ఈ విషయం గురించి నేను హైదరాబాద్లోని రెవెన్యూ అధికారులను కలువగా అది అసై న్డ్ భూమి అని తెలిసినది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లే దు. అసలు అసైన్డ్ భూమి అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తిం చాలి. లావణి పట్టీ అంటే ఏమిటి?
మీరు కొన్న భూమి అసైన్డ్ స్థలం అయి నప్పడు మీరు ఏమీ చేయలేరు. కావున వెం టనే ఎవరి వద్ద మీరు ఈ స్థలం కొన్నారో పూర్తి వివరాలతో మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ దానితో పాటు జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి గారికి విడివిడిగా దరఖాస్తు చేసుకొని జరిగిన విషయాలు వ్రాతపూర్వకంగా తెలియజేసి పత్రము ముట్టినట్లు రశీదు తీసుకోగలరు. తరువాత రెవెన్యూ అధి కారులు విచారణ చేసి దానికి ప్రతిఫ లంగా వేరొక చోట స్థలం గానీ, లేదా అదే స్థలానికి పట్టా ‘డి’ సర్టిఫికెట్ గా నీ ఇస్తారు. ఏదేమైనా ఈ విషయం లో సర్వ హక్కులూ రెవెన్యూ అధికారులకే చెందుతా యి. మీరు మంచి న్యాయవాదిని సంప్రదించి కేసు వేసినచో మీకు న్యాయం జరుగుతుంది. మీకు నష్టప రిహారం కావాలను కున్నచో మీకు స్థలం విక్రయిం చిన వ్యక్తిపై సివిల్, క్రిమి నల్ కేసులు వేయండి.
ఇక మీరు అసైన్డ్ భూమి గురించి తెలుపమని అడిగా రు. అసైన్డ్ భూమి అనగా ప్రభుత్వానికి చెందిన భూమని అర్థం. దీనిని ప్రభుత్వం వారు భూమి లేని నిరుపేదలకు, స్వాతంత్య్ర సమరయోధుల కు, రాజకీయ బాధితులకు, ఎక్స్ సర్వీస్మన్లకు ఇస్తారు. ఇక మీరు ఈ భూములను ఎలా గుర్తిం చాలంటే...సేత్వార్ అంటే అసలైన సర్వే రికార్డు లో చూడటం వలన మనం కొనే భూమికి సం బంధించిన సర్వే నెంబర్ గామం పేరు త దితర వివరాలను ప్రతి మండల ఆఫీసులోని చూడ టానికి వీలుంటుంది. అప్పుడు సరైన స్థలం అని నిర్ధారించుకున్న తరువాత భూమిని కొ నుగోలు చేయాలి. అది వ్యవసాయ భూమి అయినా మరేదైనా గానీ, గత 20 సం ముందు నుండి సర్వే రికార్డులో వివరాలు ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more