నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది రెండో భార్యలకు కలుగుతుంటాయి. అయితే నిన్న మొన్నటి వరకు వున్నా దాని ప్రకారం రెండో భార్యలు భర్తలకు సేవ చేసేందుకే కానీ, ఆయన ఆస్తులు, ఫించనుపై అధికారాలు వుండేవి కావు. కానీ తాజాగా, రెండో భార్యకు కూడా హక్కు వుంటుందని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. చట్ట ప్రకారం పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేసిన మహిళకు భర్త ఫెంచన్ అందుకునే హక్కు వుంటుందని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి హరి పరంథామన్ తీర్పు వెలువరించారు. తమిళనాడు లోని కోయంబత్తూర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ మేరకు తీర్పను వెలువరించారు.
కేసు వివరాల్లోకి వెళ్తే.. స్టానీ అనే హెచ్ కానిస్టేబుల్ కు 1973లో సుగంథి అనే అమ్మాయితో వివాహమైంది. అనంతరం వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వారిద్దరూ రెండేళ్లకు విడిపోయారు. 1976లో సుశీల అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు స్టాన్లీ. అయితే భార్యకు విడాకులు ఇవ్వకుండానే సుశీలతో వివాహం జరిగింది. అయితే తనతో దాంపత్య జీవినాన్ని కోనసాగించని కారణంగా మొదటి భార్య నుంచి 2003లో ఎరోడ్ కోర్టు నుంచి విడాకులు పోందారు. ఆ తరువాత అమె 2005లో కన్నమూశారు.
దీంతో తన మొదటి బార్య మరణించిందని, అదీ కాకుండా తమ ఇద్దరికీ విడాకులు కూడా మంజూరయ్యాయని, ఈ నేపథ్యంలో తన రెండో భార్య సుశీలకు తన ఫించను వారుసురాలిగా నమోదు చేయాలని స్టాన్లీ జిల్లా ఎస్పీని 2007లో కోరాడు. ఆ తరువాత ఆయన కూడా 2011 అక్టోబర్ లో కన్నుమూశాడు. దీంతో జిల్లా ఎస్పీ అకౌంట్స్ అండ్ ఎన్ టైటిల్ మెంట్స్ అకౌంటెంట్ జనరల్ కు ఈ మేరకు ఒక ప్రతిపాదన పంపించారు. అయితే అయితే అమె చట్ట ప్రకారం స్టాన్లీ భార్య కాదంటూ ప్రతిపాదనను అకౌంటెంట్ జనరల్ తిరస్కరించారు.
దీంతో న్యాయపోరాటానికి తెరలేపిన సుశీల ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేసింది. తన భర్త, అతని మొదటి భార్య ఇద్దరు మరణించడంతో తనకు అతని ఫించన్ ను అందేలా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును వేడుకుంది. దీంతో పీటీషన్ ను విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం విచారణ జరిపి సుశీలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. పెళ్లి చేసుకోకపోయినా, సహజీవనం చేసినా..రెండో భార్యకు కూడా భర్త పించన్ అందుకునే హక్కు వుంటుందని న్యాయమూర్తి హరిపరంధామన్ తీర్పునిచ్చారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jun 24 | భర్త నుంచి విడాకులు పోందకుండా సెపరేట్ గా వుండటం సాధ్యమేనా..? ఈ ప్రశ్న ఉదయించింది కొత్తగా ఫెళ్లైన యువ జంటలో కాదు. పాతికేళ్లు భర్తతో కలసి సంసారం చేసిన ఓ భార్య మదిలో.. ఇన్నాళ్ల... Read more