రెండు తెలుగు సినిమాలు చేశాక.. బాలీవుడ్ కు తుర్రమన్న పూజా హెగ్డే రీఎంట్రీ దువ్వాడ జగన్నాథమ్ తో బౌన్స్ బ్యాక్ అయ్యింది. ప్రస్తుతం ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తోంది. తర్వాత వరుసగా రెండు చిత్రాలకు కమిట్ అయ్యిందని ఓ వార్త అందుతోంది.
స్టార్ హీరోల సినిమాల్లో చేసే ఛాన్స్ ఉందంటూ ఫిల్మ్ నగర్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ తో 'అజ్ఞాతవాసి'ని తెరకెక్కిస్తోన్న త్రివిక్రమ్, ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పూజా హెగ్డే అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. ఇక మహేశ్ 25వ సినిమాను తెరకెక్కించనున్న వంశీ పైడిపల్లి కూడా, ఈ సినిమాలో ఓ కథానాయికగా పూజా హెగ్డేను తీసుకుందామని భావిస్తున్నాడట.
డేట్స్ సర్దుబాటు చేయగలిగితే .. ఈ రెండు భారీ ప్రాజెక్టులు పూజాకి దక్కినట్టేననే టాక్ వినిపిస్తోంది. మరి పూజా లక్కీ ఛాన్స్ నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఒపిక పెట్టాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more