దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్. ఈ క్రమంలో నాగచైతన్య కూడా మజలీ చిత్రం హిట్ కోట్టిన తరువాత తన రెన్యూమరేషన్ పెంచేశాడు.
ప్రస్తుతం 'వెంకీమామ' చేస్తోన్నాడు చైతూ, ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పూర్తయిన వెంటనే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ ఒక సినిమా చేయనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఈ సినిమాలో చైతూ సరసన సాయిపల్లవి నటించనుంది.
ఆ తరువాత దిల్ రాజు నిర్మాణంలో చైతూ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాతో 'శశి' అనే యువ దర్శకుడు పరిచయం కానున్నాడు. తొలుత 'శశి' వినిపించిన కథలో మార్పులు చెప్పిన చైతూ, ఆ తరువాత ఆ కథ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడట. దాంతో మరో కథను తీసుకుని వెళితే నచ్చలేదని చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'మజిలీ' హిట్ నుంచి కథల విషయంలో చైతూ కాస్త గట్టిగానే ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు. దీంతో ఈ చిత్రం పట్టాలెక్కుతుందా.? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more
Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more