గతకొంతకాలం నుంచి సైలెంటుగా వున్న దర్శకుడు పూరీజగన్నాథ్.. ఈమధ్య వేగం పెంచుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఇతను దర్శకత్వం వహించిన ‘టెంపర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుండగా.. చార్మితో కలిసి ‘జ్యోతిలక్ష్మీ’ అనే మూవీని సెట్స్’పై తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని పూరీ ఇదివరకే వెల్లడించాడు.
ఇదిలావుండగా.. మెగాహీరో వరుణ్ తేజ్, ప్రిన్స్ మహేష్ బాబు ఇద్దరితోనూ పూరీ మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు. అయితే వీరిలో ఎవరిది ముందు ప్రారంభిస్తాడోనన్నది మాత్రం సస్పెన్స్’గానే వుండిపోయింది. ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ముందుగా వరుణ్’తో మూవీ చేస్తానని ప్రకటించిన పూరీ.. అదే సమయంలో మహేష్ బాబు కోసం స్ర్కిప్ట్ పనులు ప్రారంభించాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్’గా సెలక్ట్ అయిన గిబ్రాన్ అప్పుడే పాటలు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అప్పుడే చివరిదశకు చేరుకున్నాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే.. ప్రస్తుతం మహేష్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్’లో బిజీగా వున్నాడు. ఆ మూవీకి శ్రీమంతుడు లేదా జమీందార్ అనే టైటిళ్లు పరిశీలనలో వున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ముగిసిన వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందే ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో మహేష్ పనిచేయాల్సి వుంది. కానీ.. ఇంతలోనే పూరీ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు మహేష్ కూడా సందిగ్ధతలో మునిగిపోయాడు. ఆల్రెడీ కమిట్ మెంట్ ఇచ్చిన అడ్డాల మూవీని చేయాలా..? లేక తన కెరీర్’లో బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన పూరీ డైరెక్షన్’లో చేయాలా..? అన్న ఆలోచనల్లో మునిగిపోయాడని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
మరోవైపు.. ‘ముకుంద’ తర్వాత ఖాళీగా వున్న వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నిజానికి వరుణ్ తన రెండో మూవీ దర్శకుడు క్రిష్’తో ఇదివరకే కమిట్ అయ్యాడు. అందుకు స్టోరీని కూడా రెడీ చేశారు. అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించనున్నారు. అయితే.. క్రిష్ అటు బాలీవుడ్’లో ‘గబ్బర్’ మూవీ షూటింగ్’లో బిజీగా వున్నాడు. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు ముగియనుందో ఇంకా తెలియదు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు పూరీ ఇతనితో మూవీ చేసేందుకు రెడీగా వున్నానని ముందుకొచ్చాడు. దీంతో.. వరుణ్ కూడా సందిగ్ధతలో మునిగిపోయాడు. కానీ.. కమిట్ మెంట్ ప్రకారం ముందుగా క్రిష్’తోనే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలాఖరులో వీరిద్దరి మూవీ సెట్స్’పైకి వెళ్లనుందని సమాచారం! అంటే.. పూరీతో చేయాల్సిన మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్’పైకి వెళ్లే అవకాశాలు వున్నాయి.
వరుసగా సినిమాలు చేయడంలో దూకుడు పెంచిన దర్శకుడు పూరీజగన్నాథ్.. ఇలా అందరి మూవీలను ఒప్పుకుని అందరినీ కన్ఫ్యూజన్’లో పెట్టేశాడు. ముందుగా వరుణ్’తో చేస్తానని ప్రకటించిన పూరీ.. మహేష్’తో కలిసి తీయబోయే చిత్రాన్ని జూన్’లో సెట్స్’పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఇలా ఈ విధగా అటు మెగాహీరోతో, ఇటు ప్రీన్స్’తో మూవీ చేస్తానంటూ ‘పూరీ’లు ఉడికిస్తున్నాడు ఈ దర్శకుడు! ఈ మొత్తం చిక్కుముడి విడాలంటే.. మరికొన్నాళ్ల వరకు ఆగాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more