రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచితే మా పార్టీకి వచ్చే లాభం ఏమిటి? అనే ప్రశ్న ఎవరు వేసి ఉంటారు? ఏ పార్టీకి అంత దైర్యం ఉంది? ప్రతిపక్ష పార్టీనా, లేక అధికారి పార్టీనా అని అంటే.. తప్పకుండా ఈ ప్రశ్న వేసింది అధికార పార్టీయే. కానీ ఇక్కడ ట్విస్టు కూడా ఉంది. ఈ ప్రశ్న వేసింది మరీ తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు కాదు, ఢిల్లీ పెద్దలు అంతకంటే కాదు. సీమాంద్ర ప్రజలచే ఎన్నుకోబడిన, సీమాంద్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు మన పల్లం రాజు గారు. అమ్మ దగ్గర , రాహుల వద్ద అతి చనువుగా మాట్లాడే వ్యక్తి మన పల్లంరాజు, సీమాంద్ర ఎపీ ఎన్జీవోలతో కలిసిన సందర్భంలో .. ఆయన వాడిన అమ్మ బాణం ఇదేనట. సీమాంద్ర నాయకుడిగా ఉన్న పల్లం రాజు వద్దకు వెళ్లిన ఎపీ ఎన్జీవోలకు మైండ్ బ్లాక్ అయ్యి, ఎం చెప్పాలో తెలియక ఒకరు ముఖాలు ఒకరుచూసున్నారని ఢిల్లీలోని మీడియా వర్గాలు అంటున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరిన ఎపీ ఎన్జీవోలకు సీమాంద్ర నాయకుడు పల్లంరాజు రాష్ట్రం సమైక్యాంగా ఉంచితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏమిటి? అని అడగటంతో.. వారు ఒక్కసారిగా ఖంగుతిన్నట్లు సమాచారం. పల్లంరాజు పదవి మీద వ్యామోహంతో, అమ్మ మీద ప్రేమతో రాహుల్ మీద అభిమానంతో ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. పల్లంరాజుకు సీమాంద్ర ప్రజల మనోభవాలు కంటే.. అమ్మ ఇచ్చే అధికారం కోసమే లోంగిపోయినట్లుగా కనిపిస్తుందని ఎపీ ఎన్జీవో ఉద్యోగులు అంటున్నారు. పల్లంరాజుకు సీమాంద్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం పై చులకన భావం ఉండబట్టే ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇలాంటి నాయకులు ఢిల్లీలో తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంటే.. ‘‘ తోకే కుక్కను ఉపే రోజులు వస్తాయని’’ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవి కోసం పాకులాడే మన నాయకులు ఇంక చాలా మంది ఢిల్లీలో ఉన్నారని ఎపీ ఎన్జీవో ఉద్యోగులు గుర్తించి, మౌనంగా బయటకు వచ్చినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more