కొత్తగా కేంద్ర హోం మంత్రి సీటులో వచ్చిన సుశీల్ కుమార్ షిండే తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవటం తెలిసిన విషయమే. అయితే ఎప్పటి నుంచె నలుగుతున్న తెలంగాణ సమస్యకు పరిష్కారం చెబుతానని, ఆంద్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, అన్ని పార్టీల నాయకులు చెప్పిన విషయాలు విన్న షిండే ఒక నెల సమయం కావాలి? జనవరి 28న తెలంగాణ పై ఒక ప్రకటన చేస్తానని చెప్పటం జరిగింది. షిండే మాటల పై ఆశ మేడలు కట్టుకున్నారు తెలంగాణ ప్రాంత నాయకులు. అయితే తెలంగాణ విషయం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక్కేట చర్చలు జరుగుతున్నా సమయంలో గులాబ్ నబీ ఆజాద్ షిండే స్పీడ్ కు బ్రేక్ వేయటం జరిగింది. అసలు ఇక్కడే మొదలైంది? తెలంగాణ సమస్య గురించి షిండేకు ఏం తెలుసు? షిండే తెలంగాణ సమస్యను ఒక నెలలో పరిష్కారిస్తాడా? నెల అంటే నెల కాదు? ఆనే మాటలతో ఆంద్రప్రదేశ్ లో కొత్త గొడవలకు ఆజ్యం పోశాడు. షిండే తెలంగాణ పై నిర్ణయం చెప్పటానికి రెండు రోజుల ముందే ఆంద్రప్రదేశ్ నాయకులకు ఆజాద్ గులాబ్ జామ్ తినిపించాడు. ఆంధ్ర నాయకులు ఒత్తిడి వల్లే ఆజాద్ ఆప్రకటన చేసినట్లు టీ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ నాయకులు అనుకున్నారు. కానీ షిండే మాత్రం ఆంద్ర నాయకులకు గానీ, ఆజాద్ మాటలకు గానీ భయపడలేదట. తెలంగాణ పై ప్రకటన చేయటానికి సిద్దమైన చివరి నిమిషాలో షిండే అనుకోని షాక్ తగిలిందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం పై ఆంద్ర నాయకుల ఒత్తిడితో షిండే వెన్కకి తగ్గినట్లు తెలంగాణ నాయకులు అంటున్నారు , కానీ అసలు నిజం అదీ కాదని ఢిల్లీ నాయకులు చెబుతున్నారు.
యూపీఏ సర్కారుతో పాుట కాంగ్రెస్ కూడా తెలంగాణ పై ఏదో ఒక నిర్ణయానికి వచ్చేద్దామని అనుకుంది. తెలంగాణ సానుకూలమేనే సంకేతాలను కూడా రాష్ట్రంలోని పార్టీకి చెందిన తెలంగాణ క్యాడర్ నుంచి తెలంగాణ వాదుల వరకు అందరికీ పంపింది. అయితే .. ఈ విషయాన్ని ఉప్పందుకున్న గూర్ఖాల్యాండ్ ఉద్యమకారులు హటాహుటిన గోర్కా జన్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తో కలిసి మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిసింది. కాబట్టి పనిలో పనిగా తమకు కూడా గుర్ఖాల్యాండ్ ను ప్రకటించేస్తు చాలా బాగుంటుంటూ వారు షిండేకు వార్నింగ్ లాంటి డిమాండ్ ను షిండే ముందు ఉంచారట. అసలే తెలంగాణ సమస్యతో తలనొప్పితో బాధపడుతున్న షిండేకు గుర్ఖాల్యాండ్ వారి డిమాండ్ సమ్మెట దెబ్బలా పడిందట. దీంతో కంగుతిన్న షిండే తొందరేముందండంటూ వారికి నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తే అదే సూత్రాన్ని తెలంగాణ విషయంలో కూడా అనుసరించాలంటూ చెప్పి వారు వెళ్లిపోవటం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అప్పటి నుండి షిండే కు నిద్ర పట్టలేదట. వెంటనే కాంగ్రెస్ పెద్దలతో షిండే వాపోయారట. ప్రత్యేక వాదాలు దేశంలో చాలానే ఉన్నయాని అనవసరంగా కదపొద్దని.. ఆయన మంత్రికి సలహా ఇవ్వడంతో తెలంగాణ ప్రకటనపై వెనక్కి తగ్గుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు చెప్పేసి చేతులు కడుక్కోవటం జరిగినట్లు సమాచారం. షిండే ఆభయంతోనే వెనక్కి తగ్గినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఈ పరిణమమం తరువాతనే ఆజాద్ తెరపైకి వచ్చినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more