జగన్ ఎప్పుడు ప్రభుత్వం నా పై కుట్ర చేస్తుందని మీడియా ముందు ప్రచారం చేస్తున్న జగన్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పై చార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చట్టం ముందు ఎవరు తప్పు చేసిన ఒక్కటే . వారు అదీకార పార్టీ నాయకులు కావచ్చు, మిగత పార్టీ వారు కావచ్చు. ఎవరికైన చట్టం ఒక్కటే అని అశోక్ చవాన్ విషయంలో జరిగింది. ఎందుకుంటే .. అశోక్ చవాన్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్తో పాటు మరో 12 మందిపై సీబీఐ ముంబై సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సమాచారం.. చవాన్ తన సమీప బంధువులకు రెండు ఫ్లాట్లు కేటాయించుకున్నట్లు తన పదివేల పేజీల సుదీర్ఘమైన చార్జిషీట్లో ఆరోపించటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ‘ఆదర్శ్’ కుంభకోణం వెలుగులోకి రాగానే చవాన్ తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తనపై సీబీఐ చార్జిషీట్ అనూహ్యమైనదని, ఇది దురదృష్టకరమైనదని చవాన్ చెబుతున్నారు.
చవాన్ తన హయాంలో, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీకి అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు (ఎఫ్ఎస్ఐ) అనుమతులు మంజూరు చేశారని, ‘క్విడ్ ప్రో కో’లో భాగంగా తన బావమరిది, అత్తగారి పేరిట ఫ్లాట్లు పొందేందుకే ఆయన ఈ అనుమతులు మంజూరు చేశారని సీబీఐ తన చార్జిషీట్లో ఆరోపించటం జరిగింది. ఇదే కాకుండా, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు, కార్గిల్ అమరవీరుల భార్యలకు కేటాయించాల్సిన ఈ ఫ్లాట్లలో 40 శాతం ఫ్లాట్లను చట్టవిరుద్ధంగా సాధారణ పౌరులకు కేటాయించినట్లు సమాచారం. అయితే
ఇన్ని అభియోగాలు మోపినా సీబీఐ చవాన్ను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, ఆయన అరెస్టుకు అనుమతి కోరకపోవడం గమనార్హం. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలోని మొత్తం 103 ఫ్లాట్లు ఉండగా, 24 ఫ్లాట్లు బినామీలకు కేటాయించినట్లు గుర్తించామని సీబీఐ సెషన్స్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. వాటి అసలు యజమానులెవరో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మాజీ సైనికాధికారి ఆర్.సి.ఠాకూర్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కన్హయ్యాలాల్ గిద్వానీలకు వీటిలో ఎనిమిదేసి ఫ్లాట్లు బినామీల పేరిట ఉన్నట్లు సీబీఐ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా, ‘ఆదర్శ్’ కుంభకోణంలో మిగిలిన కాంగ్రెస్ నేతల పాత్రపై కూడా దర్యాప్తు సాగించాలని బీజేపీ డిమాండు చేస్తుందని మీడియా వర్గాలు అంటున్నాయి .
నిర్ణీత 60 రోజుల గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయడంలో సీబీఐ విఫలమడంతో ఈ కుంభకోణంలో అరెస్టయిన మొత్తం తొమ్మిది మంది నిందితులకూ బెయిల్ ఇవ్వటం జరిగిందట.. తొలుత ఈ ఏడాది మే 29న ఏడుగురికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు, గతనెల 7న మరో ఇద్దరు ఐఏఎస్లకు బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో అశోక్ చవాన్తో పాటు మరో మాజీ సీఎం విలాస్రావు దేశ్ముఖ్పైనా ఆరోపణలు వస్తున్నాయి. విలాస్రావు సీఎంగా ఉండగానే ఈ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షలు అంటున్నాయి. అశోక్ చవాన్ అప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్న విషయాన్ని తెరపైకి ప్రతిపక్షలు తెస్తున్నాయాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అవినీతికి పాల్పడిన వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది మహారాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఆంద్రప్రదేశ్ లో అవినీతి పై జరుగుతున్న యుద్దం ప్రజలందరికి తెలిసిందే. చట్టం ముందు ఎవరైన సమానమే అని మరోసారి రుజువు అయ్యింది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదని జగన్ తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more