ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట అనే సామెతను గురజాడ కన్యాశుల్కంలో వాడినట్లు ప్రజలు అంటున్నారు. ఇప్పుడు అది సామెతను ఎంకి పెళ్ళి .. మోపిదేవి చావుకొచ్చిదని .. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో చేవులు కోర్కుకుంటున్నారట. నిన్నటి వరకు మంత్రి గా ప్రజలకు తెలుసు. నేటి నుండి ఆయన జైల్లో పడిన ఖైదీగా.. తెలుస్తుందని మీడియా వారు అంటున్నారు.
అసలు మోపిదేవి అరెస్ట్ ఎందుకు చేశారు? ఆయన మంత్రి కదా అంటే పొరపటే? గత జన్మలో చేసిన పాపాలు .. నేటి జన్మలో మనకు తగులుతాయాని పెద్దలు చెప్పటం వినే ఉంటాం. అలాగే.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ..మోపిదేవి చేసింది కేవలం .. ‘ఎస్’ అన్నందుకే .. ఈ రోజు మోపిదేవి జైల్లో ఉండవలసి వచ్చిందని మోపిదేవి వెంకటరమణ సన్నిహితులు అంటున్నారు. అప్పట్లో జరిగిన అక్రమాల కుంభకోణం గురించి మోపిదేవి తెలియకపోయిన .. మంత్రి హోదాలో ఉండి .. వైఎస్ చెప్పినట్లు చేయటమే.. ఈరోజు మోపిదేవి సంకెళ్ళు పడేలా చేశాయాని రేపల్లే ప్రజలు అంటున్నారు.
వైఎస్ఆర్ ఉన్న సమయంలో.. మోపిదేవికి తెలియాకుండానే .. వాన్ పిక్ సంస్థకు 15వేల ఎకరాల సాగుభూమిని ఇవ్వటం , అలాగే లేపాక్షి 10 వేల ఏకరాల భూమి కేటాయించటం , ఇంక ఎన్నో కంపెనీలకు వేల ఏకరాల సాగుభూమిని కేటాయించటంతో కోట్ల రూపాయాలు దండుకోవటం జరిగిందని మోపిదేవి సన్నిహితులు అంటున్నారు. ఆ సమయంలో మోపిదేవి కేవలం సంతకం చేయటం వలనే ఈ రోజు మోపిదేవి చేతికి సంకెళ్ళు వేసుకోవలసి వచ్చిందని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఇలా రాజకీయ నాయకులు అరెస్ట్ కావటం కూడా మంచిదేనని ప్రజలు అంటున్నారు. ఇక రాబోయే రాజకీయ నాయకులు తెలుసుకుంటారని, అవినీతి పాల్పడితే ఏం జరుగుతుందో తెలుస్తుందని ప్రజలు అంటున్నారు. ఇకనైనా రాజకీయనాయకులుతో .. బిజినెస్ చేసే పెద్ద కంపెనీలు దూరంగా ఉంటాయాని ప్రజలు అంటున్నారు. గతంలో మాదిరి .. రాజకీయ నాయకులతో రాజీ వచ్చి .. తక్కువ ధరలకు వేల ఎకరాలు తీసుకొని .. రాజకీయ నాయకులకు అవినీతి సొమ్ము ముట్టచెప్పటం లాంటివి ఇక జరగవని ప్రజలు అంటున్నారు.
పేద ప్రజల నాయుకుడు అయిన జగన్ కు 35 ఏకరాల ఇల్లు అవసరమా? పేద ప్రజలకు ఉండటానికి స్థలం దొరక్క చస్తుంటే .. జగన్ మాత్రం ఏకంగా 35 ఏకరాలను తన సొంత ఇంటిన్ని నిర్మించుకోవటం ఎంతవరకు న్యాయం? ప్రజల మధ్య ఉన్న మాత్రం ప్రజలే నా ప్రాణం అంటు తిరుగుతు మేక వన్నే పులి మాదిరిగా జగన్ చర్యలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు.
మన దేశ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ కు ఇప్పటి వరకు ఢిల్లీ లో సొంత ఇల్లు లేని విషయం జగన్ ఒక్కసారి గుర్తించుకోవాలని ప్రజలు అంటున్నారు. మన జాతీ పిత అయిన గాంధీ జీ ఎప్పుడు ఆశ్రమమంలోని గడిపిన రోజులు మన రాజకీయ నాయకులు గుర్తించుకోవాలని ప్రజలు అంటున్నారు. మోపిదేవి అరెస్టె దెబ్బతో రాజకీయ నాయకుల్లో చైతన్యం రావాలని తెలుగు ప్రజలు కొరుకుంటున్నారు. అవినీతి అంతం చేసే .. ఆదర్శ నాయకుల వైపే ప్రజలు ఉంటారని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తెలుసుకోవాలి..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more