వైఎస్ఆర్ సీఎం కాగానే స్వామి వారికి రెండు కొండలు చాలని ఏకంగా తిరుమల పరిధిని తగ్గిస్తూ జీవో జారీ చేశారు. పొరపాటున రేపు జగన్ అధికారంలోకి వస్తే తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కకు జరిపి వైఎస్ విగ్రహం పెట్టిస్తారేమోనని అనుమానంగా ఉంది. అప్పుడు భక్తులంతా ఓం వైఎస్ నమః...ఓం జగనాయ నమః అంటూ వెళ్ళాల్సి వస్తుంది' అని టీడీపీ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడారు. మిగిలిన ఐదు కొండలు జగన్కో.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికో.. మరెవరికో ఇద్దామని అలా చేసి ఉంటారు.
తిరుమలలోని విగ్రహం వట్టి నల్లరాయని, దానిని చెప్పుతో కొడితే ఏమవుతుందని గతంలో ఉపన్యాసాలు చెప్పిన కరుణాకరరెడ్డిని టీటీడీ చైర్మన్గా చేశారు. ఒకప్పుడు ఎస్టీడీ బూత్ నడుపుకొన్న కరుణాకర్రెడ్డి ఇటీవల రూ. పది కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్ళి చేశారు. రెండు ఎకరాల్లో ఇల్లు కట్టారు. ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది' అని ఆయన ప్రశ్నించారు. 'జగన్ ముత్తాత బళ్ళారిలో బ్రిటీష్ ఆర్మీకి ఎద్దు మాంసం సరఫరా చేసేవారు. జగన్ తాత రాజారెడ్డి బ్రిటీష్ ఆర్మీలో సిపాయిగా చేరాడు. భారతదేశంపై జపాన్ దాడి చేస్తోందని తెలియగానే యుద్ధంలో ఏమైనా అవుతుందని సైన్యం నుంచి పారిపోయాడు. స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్ళకు బయటకు వచ్చాడు.
ఆ కుటుంబానికి దైవ భక్తి లేదు...దేశ భక్తి లేదు' అని ఆయన అన్నారు. జగన్ బావ మరిది అనిల్ క్రైస్తవ సంఘం పెట్టి వాటి కోసం వచ్చే నిధులన్నీ రాబట్టుకొంటున్నాడని ఆయన విమర్శించారు. 'రెడ్డి కులస్థులు మంచికి మారుపేరు. సర్వం కోల్పోయినా ధర్మం తప్పరు. కాని జగన్ మాత్రం ధర్మం కాలరాసి సర్వం తనకే కావాలనుకొంటున్నాడు. మా కులం పేరు పోగొడుతున్నాడు. నేను పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామి పటం చూసిన తర్వాతే ఇంట్లోని వారి మొహం చూస్తాను. ఈ వ్యవహారాలు నాకు బాధ కలిగించి ఈ మాటలు మాట్లాడుతున్నాను' అని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more