సినిమా హీరోయిన్ గా ఎదగలంటే .. అందం ఉంటే సరిపోతు.. అందుకు తగ్గ అదృష్టం, ఉండాలి, ఆ అదృష్టంతో పాటు లక్ కూడా ఉంటే.. ఆ హీరోయిన్ .. నెం.1 స్థాయిలో ఉంటుంది. అది నిజమని రుజువు చేసింది మీల్క్ బ్యూటి తమన్నా. హ్యాఫీ డేస్ మూవీ తరువాత .. ఈ తెల్ల పిల్లకు అన్ని రోజులు హ్యాపీగానే గడుస్తున్నాయి. ఇటు టాలీవుడ్ లోను కాకుండా .. అటు కోలీవుడ్ లో కూడా.. తమన్నా తన సత్తా చాటుకుంది. కోలీవుడ్ లో అన్నదమ్ములతో కలిసి నటించిన తమన్నాకు గొప్ప విజయాలను తన సొంతం చేసుకుంది. తమిళ హీరోలైన .. సూర్య, కార్తీక్ లతో చేసిన సినిమాలు తమన్నా ఖాతాలో గొప్ప విజయాలు చెప్పుకోవచ్చు.
ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అదే వరుసలో తమన్నా అడుగులు వేస్తుంది. తమన్నా తన అదృష్టాన్ని మెగా ఫ్యామిలీతో పరిక్షించుకోనుందని.. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మొన్న స్టైలీస్ స్టార్ అయిన అల్లు అర్జున్ తో కలిసి బద్రీనాద్ సినిమాలో తమన్నా అందాలను ఆరబోసి.. టాలీవుడ్ మంచి ఆఫర్స్ ను కొట్టేసింది. తమన్నా నటనతోకు మెచ్చి .. మెగా ఫ్యామిలీ ఆమెకు మరొ ఆఫర్ .. మగధీరుడు పక్కన ఇచ్చింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో రచ్చ సినిమాలో .. తమన్నాతన నటనను రచ్చ రచ్చ చేయునుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు తమన్నా అనుకున్న కల నేరవేరిందని తన సన్నిహితులతో చెబుతుందట.
ఈ తెల్ల పిల్ల ఏ ముహార్తన మెగా ఫ్యామిలీ హీరోలతో జత కట్టిందో గానీ.. మళ్లి ఆమె అనుకొని బంఫర్ ఆఫర్ తగిలిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. నిన్న మెనల్లుడు, అల్లు అర్జున్, నేడు కొడుకు రామ్ చరణ్ తో .. రేపు .. తమ్ముడైన పవన్ కళ్యాణ్ తో కలిసి నటించనుందని.. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి ముగ్గురు హీరోలతో తమన్నా నటించింది అనే గొప్ప టాక్ ఈ తెల్ల పిల్లకే దక్కిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు పాత్రలో నటిస్తున్నాడు. అయితే గంగ ఎవరు? అనే విషయం మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సస్సెన్స్కు తెర తీశారు. ఈచిత్రంలో గంగ పాత్రలో తమన్నా నటిస్తున్నట్లు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమెనే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ అని స్పష్టం చేశారు.
మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మీడియాలోని చీడ పరుగులపై సెటర్లు ఉంటాయని, విలువలు దిగజార్చి మీడియాను డబ్బు సంపాదించడానికి, అక్రమార్జనకు వాడుకుంటున్న వారిని ఎండగట్టే విధంగా డైలాగులు ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ తాజా సినిమా మీడియాలో సెన్షేషన్ సృష్టించడం ఖాయం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more