తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ కిషన్రెడ్డి చేపట్టిన పోరుయాత్ర రాజకీయ యాత్రకాదని, చరిత్రాత్మకంగా నిలిచే తెలంగాణ సాంస్కృతిక యాత్ర అని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అంటున్నారట. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నిరాఘాటంగా సాగిస్తున్న తెలంగాణ పోరు యాత్ర, వెల్లువెత్తుతున్న జన స్పందనతో ఆ పా ర్టీ శ్రేణుల్లో సంతోషం రోజురోజుకూ పెరిగిపోతు న్నది. పాలమూరు జిల్లాలో ప్రారంభమై ఈ నెల తొమ్మిదిన ఖమ్మం జిల్లా భద్రాచలంలో ముగియనున్న ఈ యాత్ర కమలనాథులకు బాగా కలసి వచ్చిందని చెబుతున్నారట. కిషన్ చేస్తున్న యాత్రతో తెలంగాణ ప్రాంతంలోని టీఆర్ ఎస్ నాయకులకు భయం పట్టుకుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
కిషన్రెడ్డి యాత్రకు జనం నుంచి వస్తున్న స్పందన గమ నించిన తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు కలవరంలో మునిగిపోయినట్టు సమాచారం . రాజకీయ జేఏసీలో భాగస్వామి అయినప్పటికీ, బీజేపీ సలహాలు, సూచనలు పట్టించుకోకుండా తన మాటే చెల్లుబాటు కావాలన్న టీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్ వైఖరి విసుగు పుట్టించటంతో బీజేపీ క్రమంగా జేఏసీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనటం మానేసిందట. సీని యర్ నేతలలో ఒక్క విద్యాసాగరరావు మినహా మిగిలిన వా రు జేఏసీకి దూరంగానే ఉంటూ వస్తున్నారట అయితే ఈ దెబ్బకు ఠారెత్తి న రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామిరెడ్డి ఏకంగా బీజేపీ కార్యాలయంలోనే స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన అంటున్నారు.. తెలంగాణ పోరు యాత్రకు అనివార్య పరిస్థితిలో మద్దతు పలికి తాను స్వయంగా పాలమూరులో జరిగిన యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ముందు ఉంటున్నాడటన అంతేకాకుండా మరి కొన్నిచోట్ల టీఆర్ఎస్ శ్రేణులు సైతం యాత్రలో పాల్గొన్నాయాని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
బీజేపీ యాత్ర వలన రానున్న ఉప ఎన్నికల లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓట్లకు గండి పడే స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. తెలం గాణ వాదానికి ఉధృతమైన మద్దతు లేని దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో సైతం జనం విశేషంగా హాజరు కావటం తెలంగాణ రాష్ట్ర సమితి కి ఇబ్బంది కలిగించే పరిణామమే అని ఆ పార్టీ నేత లు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారట అంతే కాకుండా టీఆర్ఎస్ అభ్య ర్థులను ఓడించగలిగినంత బలం లేకపోయినా గత సార్వ త్రిక ఎన్నికలకన్నా ఈసారి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు కచ్చితంగా పెరుగుతుందని, ఆ దామాషాలో తమ అభ్యర్థుల మెజారిటీ తగ్గటం ఖాయమన్న అభిప్రాయాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో భయం మొదలైందని టీఆర్ ఎస్ భవనంలో అనుకుంటున్నారు.ఒక వేళ అదే జరిగితే పోటీ తీవ్రంగా ఉన్నచోట కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్య ర్థుల నుంచి తమకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాక తప్పదన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఈ పరిస్థితి గమనించినందునే టీఆర్ఎస్ నేతలు, జేఏసీ నేతలూ తమకు మద్దతు ప్రకటిస్తున్నారని, ఎన్నికల అవగా హన కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని బీజేపీ నేతలు కొం దరు తెలిపారు. అయితే తమ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలంగాణలో జరిగే ఆరు ఉప ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయిం చారని, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలు, వాటిలో తమ పార్టీ అభ్యర్థుల బలాన్ని బేరీజు వేసుకునేందుకు ఉపయోగపడతాయని వారు చెప్పటంతో.. టీఆర్ ఎస్ కు గొంతులో వెల్కకాయ పడినట్లు ఉందని .. ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారని .. తెలంగాణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more