రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అధికార, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా మరో తృతీయ కూటమి రానుందా? 2014 లో ఎన్నికలలో సైకిల్ పైకి ఎక్కాటాని రెండు పార్టీలు విముకత చూపుతున్నాయాట. ఆ రెండు పార్టీలో సైకిల్ తో పొత్తు పెట్టుకోకుండా స్వయంగా 2014 ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేస్తున్నాయట. ఇన్నాళ్లూ పాలూ నీళ్లుగా కలిసి ఉండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు, పోరాటాలతో పాలకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సీపీఎం, సీపీఐ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వచ్చే సరికి ఏదో ఒక పార్టీతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నారని అనేది వాస్తవం.
అదే విషయాన్ని ఆ పార్టీల నేతలను కదిపితే బలం ఉన్న చోట సొంతంగానే దిగాలనుకున్నా మిగిలిన సీట్లలో తమ ఓట్లు ఎవరికో ఒకరికి వేయాలి కదా? అందుకనీ.. కలిసే ఫలానా పార్టీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నామనే సమాధానం చెబుతున్నారు.. అయితే ఈ పోత్తుల ఎత్తుల కమ్యూనిస్టు పార్టీలు చిత్తయ్యాయనే ప్రచారం బలంగా ఉందని. వామపక్ష పార్టీలకు బలం ఉన్న చోట సీట్లను కేటాయించక పోవడం బలం లేని చోట సీట్లు ఇవ్వడంతో కమ్యునిస్టు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి భారీగా చోటుచేసుకుందని . సీట్ల ఫీట్లు దాటి ఓట్ల దగ్గరికి వచ్చే సరికి పొత్తు పెట్టుకున్న పార్టీలు కమ్యూనిస్టులకు చెయ్యి ఇవ్వడంతో వామపక్షాలు గత ఎన్నికల్లో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాయన్న వాదన ఉభయ వామపక్ష పార్టీల్లోనూ వ్యక్తమవుతున్నాయాట.
అంతే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలపై పాలక పక్షంగా విరుచుకుపడితే తోక పార్టీల వాళ్లా మమ్మల్ని విమర్శించేదాని ? అంటూ వ్యంగ్యాస్త్రాలతో ఎకసెక్కాడడం తెలిసిందని . ఈ తరుణంలో వామపక్ష ప్రజాతంత్య్ర లౌకిక శక్తులను ఏకం చేసి సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగి కమ్యునిస్టు పార్టీల సత్తా ఏంటో చాటాలని ఉభయ వామపక్ష పార్టీలు వ్వూహ రచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ రాజకీయ పరంగా నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాలకుగానీ, రౌండ్ టేబుల్ సమావేశాలకు గానీ రాకుండా సీపీఎం గైర్హాజరవుతుందట. పైకి మాత్రం పార్టీ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లలో ఉన్న కారణంగా రాలేక పోయామని చెబుతున్నారట. కానీ లోపల మాత్రం కారణం వేరే ఉందట. మొన్న చంద్రబాబు నాయుడు ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీ మణి విజయమ్మ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినప్పటి సీపీఎం టీడీపీకి దూరంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
తెలంగాణ విషయంలో సీపీఎం, సీపీఐ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే .. పీడిత, తాడిత ప్రజలు, పేదలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలది జెండా అజెండా ఒక్కటే కావడం విశేషం. అందుకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్లో మాత్రం రాజీపడకుండా ఉమ్మడిగానే ఆ రెండు పార్టీలు పాలక పార్టీలపై పిడికిలి బిగిస్తు కొడవళ్లకు సానబెడుతున్నాయి. ఇక పొత్తులకు కామ్రేడ్స్ దూరం! ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నా ‘తోక పార్టీలంటూ’ ఇతర పార్టీల నుండి వస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని రెండు కొడవళ్లు సిద్దంగా ఉన్నాయట.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో టీడీపీతోనో, కాంగ్రెస్ పార్టీతోనో పొత్తు పెట్టుకోవడం వల్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more