‘బిజినెస్ మేన్’ పూరి జగన్నాథ్ మార్క్ ఫిల్మ్ అంటే నేనొప్పుకోను అని అంటున్నారు. మహేష్బాబు వల్లనే ఈ సినిమాకు ఇంత రేంజ్ వచ్చిందట. మూడు రోజులకే 27 కోట్లు వసూలు చేసిందంటే అదంతా మహేష్ స్టామినానే’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పాటం విశేషంగా ఉందట.. మహేష్బాబు, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించిన ‘బిజినెస్ మేన్’ సంక్రాంతి పండుగ ముందు రోజు విడుదలైన విషయం తెలిసిందే. అయితే పూరి ‘బిజినెస్మేన్’ సక్సెస్ తో ఆనందంగా ఉన్నారట.
బిజినెస్ మేన్ షూటింగ్ మొదలయ్యే వరకూ మహేష్కి కథ చెప్పలేదట. పదిరోజులు షూటింగ్ జరిగాక పూరి కథ చెప్పాడట. మహేష్ బాబు కూడా ఒక్కరోజు కూడా సీన్ పేపర్ చూడలేదట. లొకేషన్లో అప్పటికప్పుడు డైలాగులు చెబితే విని వెంటనే చెప్పేసేవాడట. అప్పట్లో కృష్ణగారు కూడా అంతేనట. ఈ చిత్రాన్ని 74 రోజుల్లో తీయగలిగానంటే అందుకు ప్రధాన కారణం మహేష్. తను టైమంటే టైమే. దాదాపు అన్నీ సింగిల్ టేక్లే. తన వల్లనే సినిమా ఆలస్యమవుతుందనే అపప్రధ ఎందుకొచ్చిందో నాకే అర్థంగావడంలేదని పూరి అంటున్నారట..
బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ అనుభవం ఉన్న డైలాగ్స్ రాయటం జరిగిదని పూరి అంటున్నారు. మహేష్ చెప్పిన డైలాగ్స్కి క్లాప్స్ కొడటం చూస్తుంటే పూరి చాలా ఆనందంగా ఉందట.. ముఖ్యంగా క్లైమాక్స్ డైలాగ్స్కి అద్భుతమైన రెస్పాన్స్. బాగా కష్టాలు పడి నలిగిపోవడం వల్లనో ఏమో ఇలాంటి డైలాగ్స్ రాయగలినని పూరి మాటల్లో ఆర్దం అవుతుంది. ఈ సినిమా పూరి పర్సనల్ ఫిలాసఫీ డైలాగుల్లో ప్రతిబింబిస్తుందట. సమాజానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ, అందులో నిజం ఉంది. అక్కడక్కడా అశ్లీల సంభాషణలు ఉన్న మాట వాస్తవమే. ఆ పాత్రలోని తీవ్రతను తెలపడానికే అలాంటివి వాడాల్సివచ్చిందని. పూరి చెప్పాటం విశేషం. అయినా సెన్సార్వారు వాటికి కత్తెర వేశారట..
ఈ చిత్ర నిర్మాత వెంకట్కి హేట్సాఫ్ చెప్పాలి. పూరి షూటింగ్ మొదలుపెట్టకముందే ఆయన అన్ని చోట్లా థియేటర్లు బుక్ చేసేశారట. నా మీద నా కన్నా ఆయనకే ఎక్కువ కాన్ఫిడెన్స్ కనిపించిందట.. మహేష్ మేజిక్ వల్ల ఇక్కడ కుదిరింది కానీ, అక్కడ మార్పులు చేయాల్సిందే. దీనికి సీక్వెల్ చేయాలని షూటింగ్ దశలోనే అనుకున్నారట. పూరి, రవితేజతో, ఎన్టీఆర్తో చేయాల్సిన ప్రాజెక్టులు పూర్తి కాగానే మహేష్తో ‘బిజినెస్మేన్-2‘ చేస్తారట.
అంటే బిజినెస్ మేన్ -2 కొంచెం సమయం పడుతుందని ఫిలింనగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. 2012 సంవత్సరంలో హీరో, రవితేజతో , ఎన్టీఆర్ తో రెండు సినిమాలు ఉన్నయన్నమాట. పూరి 2012 లో విజయం సాదించాలని మనం కోరుకుందాం. ఆ రెండు సినిమాలు ప్రజలకు కొత్త మేసేజ్ ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుందని సినీ ప్రముఖులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more