కాలం మారుతున్న కొద్ది ప్రజల జీవన విధానం మారుతుంది. దానికి అనుగుణంగానే టెక్నాలజీ మారుతుంది. ఈ టెక్నాలజీతో పోటీ పడటటానికి మనుషులు పోటీ పడుతున్నారు. ఈ పోటీ తత్వాన్ని కొన్ని పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీలు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ కంపెనీ యొక్క వస్తువు ప్రజల్లోకి వెళ్ళాలంటే వీరు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా అయిన టీ.వి., వార్తా పత్రికలను ఆశ్రయిస్తున్నారు. ఇదే మంచి అవకాశంగా భావించిన టీవీ ఛానల్స్, వార్తా ప్రతికలు సమాజానికి ఉపయోగపడేవి కాకుండా వేరే వాటిని ప్రసారం చేస్తు ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటూ సొమ్ముచేసుకుంటున్నాయి.
గత కొంత కాలం క్రితం వరకు ప్రసార మాద్యమం అయిన టెలివిజన్ లో కొన్ని ఛానల్స్ మాత్రమే ఉండేవి. వాటిలో వచ్చిన సమాచారం పక్కాగా ఉండేది. కాని ఇప్పుడు కాలం మారింది. దానికి తగ్గట్లు గానే టీవీ ఛానెల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఛానల్స్ అయితే పెట్టారు కానీ వాటిని నడపం కోసం మాత్రం నానా తంటాలు పడుతున్నారు. ఈ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఎంతకైనా దిగజారతున్నారు.
పుట్టగొడుగుల్లా ఛానల్స్ పుట్టుకురావడంతో వీటిని చూసేవారు తక్కువగా అయ్యరు. ఎందుకూ అంటే ఈ ఛానల్స్ ఒక సమాచారన్ని పదే పదే ప్రసారం చేసుకుంటూ ప్రజలను విసిగెత్తాంచాయి. దీంతో ఆ టీవీ ఛానల్స్ రేంటింగ్ తగ్గడంతో వచ్చే ఆదాయం పడిపోయింది. దీంతో ఏం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో వీరు కొత్త ఆదాయం కనిపెట్టుకున్నారు. వీటిని అధికమించాలనే ఉంటే ఆ ఛానల్ కి ఆదాయం కావాలి. మరి ఈ ఆదాయం పెరగాలంటే ఆ ఛాలన్స్ కి ప్రకటనలు కావాలి. ఈ ప్రకటనలు రావాలంటే వాణిజ్య కంపెనీలు ఆ ఛానల్ యొక్క టీఆర్పీ రేటింగ్ చూస్తాయి. మరి ఈ ఛానల్స్ రేటింగ్ అంతంత మాత్రమే ఉండటంతో ఆదాయం పెంచుకోవడానికి కొన్ని ఛానల్స్ మరీ నీచానికి దిగాయి.
ఇప్పుడు ఉన్న ఛానల్స్ లో కొన్ని ఛానెల్స్ తన ఆదాయం పెంచుకోవడానికి స్వాముల మఠాలు, ఆశ్రమాలకు సంబంధించిన చిన్న విషయాలను బాగా ఎత్తి చూపుతూ వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాయని అంటున్నారు. ఆ ఛానల్స్ ఒకప్పుడు ఒక అయిల్ కంపెనీకి సంబంధించిన నూనె వాడితే తల వెంట్రుకలు రాకుండా ఉండటమే, ఉన్నవి ఊడిపోతాయి అని తన ఛానల్స్ లో ప్రసారం చేయడంతో భయపడిన ఆ ఆయిల్ కంపెనీ వారు వారికి డబ్బులు ముట్టజెప్పడంతో తరువాత నుండి వారికి సంబంధించిన వార్తా పత్రికలోనే ప్రకటనలు వేయడం మొదలు పెట్టారు. అలాగే ఆశ్రమాలు, మఠాల గురించి ప్రసారం చేసిన ఆ ఛానల్సే తరువాత నుండి ఆ ఊసే ఎత్తడం లేదు. అంటే దీనిని బట్టి ఇలాంటి చిన్న విషయాలన్ని పెద్దదిగా చేసి కోట్లలో రూపాయలు దుండుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
మరో టీవీ ఛానల్ అయితే మా ఛానల్ కి రేటింగ్ 5 అంటూ చెప్పుకుంటుంది. ఇంకా కొన్ని ఛానల్స్ అయితే యంత్రాలు – తాయిత్తులు అమ్ముకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఇలా ప్రసారం చేస్తూ ఆ కంపెనీల దగ్గర కోట్లు దండుకుంటున్నారు. ఇంకా కొన్ని ఛానల్స్ ఏకంగా తైలాన్ని తయారు చేసి ఈ తైలం దానికి దీనికి పనిచేస్తుందని నమ్మబలికిస్తు సంబందిత కంపెనీ వద్ద డబ్బులు దండుకుంటున్నాయని అనుకుంటున్నారు.
కొన్ని ఛానల్స్ అయితే అన్నింటి మేమే సాక్షి అంటూ చెప్పుకుంటూ ఇలాంటి అనవసరమైన ప్రకటనలు ఇచ్చుకుంటూ వాటికి కొమ్ముకాస్తున్నాయి. ఈ టీవీ ఛానల్స్ వారు ఒక వస్తువు శాస్త్రీయ పద్దతిలో తయారు చేశారా లేదా అని చూడకుండా, దాని గురించి తెలుసుకోకుండా కాసుల కోసం కక్కుర్తి పడి మార్కెట్లోకి వెళ్ళేట్లట్లు ప్రచారం చేస్తున్నాయి.
మరి ఇలాంటి ఛానల్స్ తన ఛానల్ ని కాపాడుకోవడానికి అడ్డమైన ప్రకనలు ఇచ్చి వ్యాపారం చేస్తు జనాల్ని మోసం చేస్తున్నాయని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more