వేసవికాలంలో సూర్యుడు, భూమి గ్రహానికి దగ్గరగా రావడం వల్ల.. సూర్యుని వేడితాపం (ఉష్ణోగ్రత) పెరిగిపోతుంది. దాంతో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా మానవుని శరీరం మీద పడడంతో నీరసంగా మారిపోతాడు. సూర్యకిరణాలలో కొన్ని హానికరమైనవి వుంటాయి. ఆ కిరణాలు చర్మం మీద పడినప్పుడు చర్మంలో వుండే నీటిశాతం ఒక్కసారిగా తగ్గిపోయి.. చర్మాన్ని నిర్జీవంగా మార్చేస్తుంది. ముఖ్యంగా సూర్యుని నుంచి వెలువడే అతనీలలోహిత కిరణాలు చర్మం మీద పడితే.. చర్మానికి సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇది చాలా ప్రమాదమైంది కూడా!
సాధారణంగా ప్రతిఒక్కరు వేసవికాలం అనగానే భయభ్రాంతులకు గురయిపోతారు. ఎండవేడిమిలో మానవుడు కొద్దిసేపు కూడా నిలబడలేకపోతాడు. వేసవిలో సూర్యునితాపం అధికంగా వుండటం వల్ల మానవ శరీరంలో వుండే కొవ్వు పదార్థాలు, నీరు.. చెమట రూపంలో బయటకు విసర్జిస్తాయి. అంతేకాకుండా.. ఈ నీటితోపాటు ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం వంటి పోషక లవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా లోపల నీటిశాతం తక్కువగా వుండటం వల్ల నీరసంగా మారిపోయి, వడదెబ్బకు గురవుతాడు.
అయితే వేసవిలో సూర్యునితాపం నుంచి, వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందుగా శరీరంలో నీటిని, పోషకాలను సమతౌల్యంగా వుండేటట్లు పాటించాలి. చాలావరకు ఇటువంటి పోషకాలు, నీరు కలిగిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యపరిస్థితిని వేసవిలో కూడా అదుపులో వుంచుకోవచ్చు. అందులో ముఖ్యంగా పండ్లు, పండ్లరసాలు. వీటిలో సాధ్యమైనంతవరకు శరీరానికి కావల్సిన పోషకాలతోపాటు.. నీటిశాతం కూడా ఎక్కవగా వుంటుంది. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం...
వేసవికాలంలో ఎండవేడిమిని, వడదెబ్బను తట్టుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ పండ్లరసాలు :
1. నీరు... ఇది మానవుని శరీరానికి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఎందుకంటే.. ఇది శరీరంలో వుండే అనవసర కొవ్వు పదార్థాలను, మలినాలను కరిగించి బయటకు పంపించేస్తుంది. రక్తంలో వున్న కాలుష్య పదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే కిడ్నీలలో వుండే రాళ్లను కరిగించి, మూత్రరూపంలో బయటకు పంపుతుంది. చర్మంలో తేమను ఇంకిపోనివ్వకుండా, ఎల్లప్పుడూ తేమగా వుండేటట్లు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు 3 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తాగితే... మానవ శరీరం ఆరోగ్యవంతంగా వుంటుంది.
2. మ్యాంగో జ్యూస్... మామిడిరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని తాగితే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాదు.. చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా వుంచుతూ.. మెరుపు కూడా అందిస్తుంది. మామిడి పండు క్రమంగా తీసుకుంటే చూపు కూడా చాలా బాగా కనిపిస్తుంది. అంతేకాదు.. శరీరంలో వుండే జీర్ణశక్తికీ ఎంతో సహకరిస్తుంది. వేసవి కాలంలో ఈ పండుతో చేసిన జ్యూస్ ఎంతో వైవిధ్యంగా, రుచికరంగా కూడా వుంటుంది.
3. చెరుకురసం... చెరుకులో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు పుష్కలంగా వుంటాయి. ఈ పోషకాలు రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ ను కలిగించే కారకాలతో పోరాడి.. వాటిని నియంత్రిస్తాయి. అలాగే మూత్రపిండాలు, గుండె, మెదడు పనితీరుని కూడా ఇవి బాగా మెరుగుపరుస్తాయి. చెరుకు రసాన్ని వేసవిలో తీసుకుంటే.. ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని చేకూర్చుతుంది.
4. పుచ్చకాయ జ్యూస్... ఇందులో చాలావరకు పొటాషియం, విటమిన్ ఏ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి గుండెజబ్బులు రాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా.. పుచ్చకాయలో వుండే లైకోపిన్ అనే పోషకపదార్థం.. సూర్యరశ్మిలో వుండే అల్ట్రావాయొలెట్ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటంలో ముక్యపాత్రను పోషిస్తుంది. పుచ్చకాయ జ్యూస్ తయారీలో ముందుగా కొన్ని పుచ్చకాయలను గుజ్జులను, చెక్కు తీసిన అల్లం ముక్కలను ఒక మిక్సర్ వేసి మిక్స్ చేయాలి. ఈ రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఉత్తేజితంగా పనిచేస్తుంది. అంటేకాదు.. రక్తవృద్ధిలో అవసరమయ్యే హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. శరీరంలో కరిగిపోయిన నీటిశాతాన్ని తిరిగి పెంపొందిస్తుంది.
5. మజ్జిగ... సహజంగానే పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు పుష్కలంగా వుంటాయి. ఇవి శరీరంలో పోషక విలువలను, విటమిన్లను తయారీచేయడంలో ఎంతో సహకరిస్తాయి. ఇందులో ముఖ్యంగా ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర బ్యాక్టీరియా వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో వుండే ల్యాక్టికామ్లాలు పదార్థాలను చాలా త్వరగా జీర్ణం చేయడంలో ప్రముఖపాత్రను పోషిస్తాయి. అంతేకాదు.. పెరుగులో చాలావరకు పొటాషియం, క్యాల్షియం, రైబోఫెవిన్, విటమిన్ బీ-12 వంటి పోషక విలువలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇటువంటి మజ్జిగను వేసవిలో తీసుకుంటే.. వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
6. క్యారెట్ జ్యూస్... ఎండవేడిమి నుంచి చర్మాన్ని సంరక్షించడంలో క్యారెట్ జ్యూస్ కూడా తనదైన ముఖ్యపాత్రను పోషిస్తుంది. చర్మంలో తేమను కరగనివ్వకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో పాలు, చక్కెర వేసి తాగితే చాలా మంచిది.
7. కొబ్బరి నీళ్లు... వేసవికాలంలో చర్మసంరక్షణకు కొబ్బరినీళ్లు తమదైన ప్రత్యేకతను కలిగి వుంటాయి. కుదుళ్లను ఎంతో బలంగా మార్చే కొబ్బరి పాలు.. మానవునిలో వుండే అలసటను క్షణాల్లో మాయం చేస్తాయి. శరీరంలో వుండే జీర్ణక్రియను పెంచడంతోపాటు ముత్రపిండాల్ని కూడా శుభ్రం చేస్తాయి. కొబ్బరి నీటిలో చిటికెడు పంచదార, ఉప్పును కలుపుకుని తాగితే.. డీ హైడ్రేషన్ (నీటిశాతం తగ్గడం) సమస్య వుండదు. అలాగే అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత కొబ్బరి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. సూర్యుని తాపంవల్ల నల్లగా మారిన చర్మం తాజా అనుభూతిని పొందుతుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, క్యాల్షియం వంటి 5 కీలక ఎలెక్ట్రోలైట్స్ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహకరిస్తాయి.
8. తాటిమంజలు... వేసవిలో ఎండ నుంచి ఉపశమని కలిగించడంలో తాటిమంజలు ఎంతో ఉపయోగపడుతాయి. ఇందులో 6 అరటిపండ్లలో వుండే పొటాషియం.. ఒక్క తాటిపండులోనే వుంటుంది. శరీరంలో బీపీని అదుపులో వుంచి.. కొలెస్ట్రిరాల్ ను తొలగిస్తుంది. అంతేకాకుండా ఎముకలను ఎంతో బలంగా వుంచుతూ.. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ తాటిమంజ మధ్య భాగంలో వుండే నీటిని తాగడం వల్ల శరీరంలో వుండే ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గిస్తుంది. అలగే జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఇటువంటి పోషకాలు కలిగిన తాటిమంజలు తీసుకుంటే.. ఆరోగ్యవంతంగా వుండొచ్చు.
9. నిమ్మరసం... నిమ్మకాయలో విటమిన్ సీ అపారంగా లభిస్తుంది. 100 గ్రాముల గల నిమ్మపండులో 40 కేలరీల శక్తి లభ్యమవుతుంది. నిమ్మకాయలో వుండే పోషకాలు మెదుడు చురుకుగా పనిచేయడానికి... దంతాలు, ఎముకలు పటిష్టంగా వుండటానికి ఎంతో సహకరిస్తాయి. అంతేకాకుండా రోజుకు 5 నుంచి 8 సార్లవరకు నిమ్మరసాన్ని తీసుకుంటే.. కామెర్లవ్యాధి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. ఎండవేడిమి నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో వుండే సిట్రిక్ యాసిడ్.. మూత్రపిండాలలో వుండే రాళ్లను కరిగించి, మలినాలరూపంలో బయటకు విసర్జింపచేస్తాయి.
10. ఆరెంజ్ జ్యూస్... ఇందులో కూడా విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావాయొలెట్ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో వుండే కొలాజిన్.. చర్మం ముడతలు పడకుండా, మృదువుగా, సాఫ్ట్ గా వుంచేందుకు సహకరిస్తుంది.
ఇలా ఈ విధంగా రకరకాల పండ్ల జ్యూస్ లను తాగితే.. శరీరంలో పోషక విలువలను పెంచుకోవడంతోపాటు నీటి శాతాన్ని కూడా సమతౌల్యంగా వుంచుకోవచ్చు. ఫలితంగా మనల్ని మనం వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more