భారత స్పోర్స్ట్ అథారిటి (సాయ్) అప్పుడప్పుడూ వింత నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మహిళా బాక్సర్ల కోసం ప్రత్యేకంగా ఓ నిబంధన తీసుకొచ్చింది. బాక్సింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొనే మహిళా బాక్సర్లు గర్బ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేసింది. కొత్త వివాదాస్పద నిర్ణయం ప్రకారం.., ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు గర్భ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని ప్రకటించింది. వారందరికీ పరీక్షలు చేయించాలని బాక్సింగ్ అసోసియేషన్ ను సాయ్ కోరింది.
ఈ వివాదాస్పద నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళా క్రీడాకారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. తమ వ్యక్తిగత స్వేచ్ఛ, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి నిబంధనలు తీసుకురావటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ తరహా నిర్ణయాల వల్ల క్రీడాకారులకు పోటిలపై ఆసక్తి తగ్గుతుందని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. పెళ్లి కాని వారికి అయితే సరే... కాని పెళ్లి కాని వారికీ గర్భస్థ పరీక్షలు చేయించాలని చెప్పటం వారిని అవమానించటమే అవుతుంది.
అయితే ఈ విమర్శలు, నిరసనలు పట్టించుకోకుండా సాయ్ తన పని చేసుకుపోయింది. సాయ్ కు చెందిన వైద్యులతో మహిళా బాక్సర్లకు పరీక్షలు చేసింది. ఈ విధానం కాస్త ఇబ్బందిగా అన్పించినా.., అవమానంగా భావించకుండా దేశం కోసం భరించారు. పరీక్షలకు హాజరైన వారిలో పెళ్ళి అయిన వారితో పాటు, పెళ్లి కాని యువ బాక్సర్లు, మైనర్ అమ్మాయిలూ ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఏమి చేయలేక మౌనంగా పరీక్షలకు హాజరయ్యారు అని బాక్సింగ్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.
వాస్తవానికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కూడా.., గర్బ పరీక్షలు చేయించాలని నిబందన ఎక్కడా లేదు. యువతులు, పెళ్లి అయిన వారయితే.., ప్రెగ్నెన్సీ లేదు అని సొంతంగా దృవీకరించి డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. అదే మైనర్ క్రీడాకారులు అయితే వారి తల్లితండ్రులు/ సంరక్షకులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ మినహాయింపును పక్కనబెట్టిన సాయ్ మహిళా బాక్సర్లకు పరీక్షలు చేసి వారిని అవమానించింది అని విశ్లేషకులు చెప్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more