ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు జైత్రయాత్ర అప్రతిహాతంగా కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరిగిన మ్యాచ్ లోనూ జట్టు సభ్యులు జయకేతనం ఎగురవేసి వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్లోనే కంగుతినిపించిన భారత్ జట్టు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై కూడా సునాయాస విజయాలతో సెమీస్కు చేరిన విషయం తెలిసిందే.
శ్రీలంకతో జరిగిన గ్రూప్-ఎ ఆఖరి లీగ్ మ్యాచ్లో ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మన జట్టు సభ్యులు విజయ దుందుభి మోగించారు. 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని (116 పరుగులు) చేరుకుంది. షెఫాలీ వర్మ తన సూపర్ ఫామ్ కొనసాగించింది. ఆమెకి తోడుగా స్మృతి (12 బంతుల్లో 17) కూడా మెరవడంతో భారత్ కు మంచి ఆరంభమే దక్కింది. జట్టు స్కోరు 34 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం వన్ డౌన్ లో వచ్చిన సారథి హర్మన్ప్రీత్ కౌర్ (15) పరుగులకు వెనుదిరిగినా.. మొక్కవోని దైర్యంతో షెఫాలీ ఇన్నింగ్స్ను కొనసాగించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షెఫాలీ రనౌట్ గా వెనుదిరిగింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ కలిసి లక్ష్యాన్ని చేధించారు. భారత బౌలర్లలో రాధాయాదవ్ నాలుగు వికెట్లు తీసుకోగా.. గైక్వాడ్ రెండు వికెట్లు, డి.బి.శర్మ, ఎస్.పాండే, పూనమ్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more