భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత్ పాకిస్థాన్ దేశాలమధ్య దైపాక్షిక వాణిజ్య, వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి.. కానీ క్రికెట్ మాత్రం ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ క్రీడపై ఇప్పటికైనా భారత్ సానుకూలంగా స్పందించాలని కోరారు.
అన్నివిధాల వాణిజ్య దిగుమతులు, ఎగుమతులు సాగుతున్న సందర్భంలో.. ఒక దేశం నుంచి మరో దేశానికి ఉల్లిపాయలు, ఆలుగడ్డల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని.. అలాంటప్పుడు క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్ లు జరగడం క్రికెట్ కు మంచిదని వ్యాఖ్యానించారు. క్రికెట్ ఒక్కటే క్రీడాగా గుర్తిస్తున్నారా.? ఇది కాకుండా మిగతా క్రీడలన్నింటిలో పోటీకి సై అంటున్న క్రమంలో క్రికెట్ పై మాత్రమే ఎందుకు అంక్షలు విధించారని ప్రశ్నించారు.
ఇండియా ప్లేయర్లు పాకిస్థాన్ కు, పాకిస్థాన్ ప్లేయర్లు ఇండియాకు వచ్చే పరిస్థితి లేదని.. అయితే విదేశాల్లోని తటస్థ వేదికలపై మ్యాచ్ లు నిర్వహించాలని సూచించారు. ఆసియా కప్ నిర్వహణ ఎలా పాల్గోంటున్నారో అలానే భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దైపాక్షిక క్రికెట్ కు తటస్థ మైదానాలు వేదికలుగా మార్చుకోవచ్చుకదా అని షోయబ్ అక్తర్ అన్నారు. తాము సచిన్ ను, గంగూలీని, సెహ్వాగ్ ను ఎంతగానో ఇష్టపడతామన్నారు. ఇరు దేశాల మధ్య విభేదాలు క్రికెట్ పై ప్రభావం చూపకూడదన్నది తన అభిప్రాయమని చెప్పారు. త్వరలోనే ఇండియా–పాక్ మ్యాచులు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more