ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. ఈ టోర్నీ చరిత్రలో ఏడోసారి ఫైనల్ కు చేరి సరికొత్త రికార్డును తమ పేరున లిఖించుకున్నారు. దక్షిణాఫ్రికా లోని పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా ఇవాళ జరిగిన ఉపపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. భారత్ కుర్రాళ్లు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పది వికెట్లతో పాకిస్థాన్ ను మట్టికరిపించారు. అంతకుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను భారత యువ బౌలర్ల ధాటికి స్వల్పస్కోరుకే తోకముడిచారు. 43.1 ఓవర్లు అడిన పాకిస్థాన్ జట్టు కేవలం 172 పరుగులను మాత్రమే చేయగలిగింది.
దీంతో 173 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన భారత్ 35.2 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 176 పరుగులు చేసి పూర్తి చేసింది. యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 105 నాటౌట్, 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ దివ్వాంశ్ సక్సేనా (59 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించాడు. స్వల్ప ఛేదనతో బరిలోకి దిగిన భారత్ను పాక్ ప్లేయర్లు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. భారత బ్యాట్స్మెన్ అన్ని విధాల ఆధిపత్యం కనబర్చారు. వీరిద్దరూ ఏమాత్రం తొందరపడకుండా, ఎంతో పరిణితి చెందిన ఆటగాళ్ల మాదిరిగా రాణించారు.
నింపాదిగా ఆడుతూ జట్టు స్కోరుబోర్డును ముందుకు నడిపించారు.. ఈక్రమంలో 66 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే భారత్ స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. ఫిఫ్టీ అయ్యాక జైస్వాల్ జోరు పెంచాడు. మరో ఎండ్లో కుదురుగా ఆడిన సక్సేనా 83 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జోరు పెంచిన జైస్వాల్ 90ల్లోకి దూసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 36వ ఓవర్లో భారీ సిక్సర్ తో తనదైన శైలిలో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టోర్నీలో మూడు అర్ధసెంచరీలు చేసిన జైస్వాల్.. పాక్పై శతకాన్ని సాధించాడు.
మరోవైపు టోర్నీలో ఏడోసారి ఫైనల్కు చేరుకుంది. నాలుగుసార్లు విజేతగా నిలిచిన భారత్.. రెండుసార్లు రన్నరప్తో సరిపెట్టుకుంది. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన చివరి ఎడిషన్లో నెగ్గిన భారత్.. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగింది. తాజా విజయంతో వరుసగా నాలుగోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీని గురువారం న్యూజిలాండ్-బంగ్లాదేశ్ సెమీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ విజేతతో భారత్ ఆదివారం ఇదే వేదికపై ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more