బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండ్కులర్ సరదాగా అటపట్టించాడు. వీరిద్దరూ కలసి టీమిండియా క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య స్నేహం కూడా అదేస్థాయిలో వుందనేందుకు వారిద్దరి మధ్య చోటుచేసుకున్న ఈ సరదా కామెంట్ల సన్నివేశమే తార్కాణం. నిత్యం హుందాగా వుండే సచిన్ కేవలం తనదైన వ్యక్తులతో మాత్రమే సరదాగా వ్యవహరిస్తారు. చాలకాలం తరువాత ఆయన ఇవాళ సౌరభ్ గంగూలీ ట్వీట్ ను ట్రోల్ చేశాడు. వీరిద్దరి సరదా కామెంట్లు ఎలా సాగాయంటే..
దాదా తన ఇన్ స్టాగ్రామ్ లో ‘‘ఉదయాన్నే చల్లని వాతావరణంలో మంచి ఫిట్ నెస్ సెషన్ ను చేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది’’ అని పోస్ట్ చేశాడు. దీనికి సచిన్.. ‘‘వెల్ డన్ దాది! ఏం చెప్పావ్’’ అని సరదాగా కామెంట్ చేశాడు. అయితే దాదా సచిన్ కామెంట్కు ‘‘థాంక్యూ ఛాంపియన్. ఎల్లప్పుడూ ఫిట్నెస్ పైనే దృష్టి. మన అద్భుతమైన శిక్షణ రోజులు నీకు గుర్తున్నాయా’’ అని రిప్లై ఇచ్చాడు. దీనికి సచిన్ ‘‘అవును దాది.. శిక్షణలో నువ్వు ఎంత ఎంజాయ్ చేశావో అందరికీ గుర్తుంది. ప్రత్యేకంగా స్కిప్పింగ్ లో’’ అని బదులిచ్చాడు. ఈ దిగ్గజ క్రికెటర్ల సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
సచిన్-దాదా కలిసి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగి రికార్డుల భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. వీరిద్దరు కలిసి 136 ఇన్నింగ్స్ల్లో 49.32 సగటుతో 6,609 పరుగులు చేశారు. వన్డే, టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, శతక శతకాలు సాధించిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్గా దాదా రికార్డు నమోదుచేశాడు.
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more