భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు మెరుగవ్వడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చొరవ చూపాలని పాకిస్థాన్ జట్టు మాజీ సారథి రషీద్ లతీఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం ఇరు దేశాల మధ్య కెప్టెన్ గా ఆయన తీసుకున్న చోరవనే మరోమారు బిసిసిఐ అధ్యక్షుడి హోదాలో కూడా సల్పాలని లతీఫ్ కోరాడు. 2004లో భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి నాటి కెప్టెన్గా ఉన్న దాదానే బీసీసీఐని ఒప్పించి కీలక పాత్ర పోషించాడని చెప్పాడు.
ఒక క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సాయం చేయగలడని లతీఫ్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్లు జరగనంతవరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వవని, ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల క్రికెట్ మ్యాచ్లు చూడడానికి ఎదురు చూస్తుందని ఆయన చెప్పాడు. అలాగే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో వసీంఖాన్ కూడా తన వంతు కృషి చేయాలని, పెద్ద జట్లను అక్కడ పర్యటించడానికి ప్రయత్నించాలని అన్నాడు. తద్వారా స్థానిక ఆటగాళ్లకు, పాకిస్థాన్ క్రికెట్కు ఎంతో ఉపయోగమని లతీఫ్ తెలిపాడు.
2004లో భారత్.. పాకిస్థాన్లో పర్యటించడానికి బీసీసీఐ నిరాకరించగా అప్పుడు గంగూలీనే చొరవ చూపాడని ఆటగాళ్లను, బీసీసీఐని ఒప్పించాడని గుర్తు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో విజయాలు సాధించడం ద్వారా టీమిండియాకు ఆ పర్యటన తీపి గుర్తుగా మిగిలిపోయిందన్నాడు. ఐదు వన్డేల సిరీస్ ను 3-2 తేడాతో, మూడు టెస్టుల సిరీస్ను 2-1 తేడాతో గంగూలీ నాయకత్వంలో టీమిండియా గెలుపొందింది. ఇదిలా ఉండగా పాకిస్థాన్లో దశాబ్దం తర్వాత ఇటీవలే టెస్టు క్రికెట్ పునరుజ్జీవం పోసుకుంది. శ్రీలంక జట్టు అక్కడ పర్యటించి టెస్టు సిరీస్ ను కోల్పోయింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more