మహిళల వన్డే క్రికెట్లో వేగంగా రెండువేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్ గా స్మృతి మంధాన రికార్డు నమోదు చేసింది. వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో మంధాన 74 పరుగులు చేసింది. ఇందుకు 63 బంతులను ఎదుర్కొంది. ఈ మ్యాచ్ ను భారత్ 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ప్రస్తుతం మంధాన మొత్తం 51 వన్డేలు ఆడి 2025 పరుగులు చేసింది. ఈ మైలురాయికి చేరిన తొలి మహిళా క్రికెటర్ గా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్, ప్రస్తుత జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
అయితే బెలిండా క్లార్క్, మెగ్ లానింగ్ ఇద్దరూ ఈ రికార్డుకు 45 వన్డే ఇన్నింగ్స్ లోనే చేరుకోగా, స్మృతి మంధాన మాత్రం 51 వన్డేలలో ఈ రికార్డుకు చేరుకుంది. కాగా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా అమె రికార్డులను సోంతం చేసుకుంది. పురుష క్రికెటర్లలో తమ కెరియర్లో 2 వేల పరుగుల మైలురాయిని వేగవంతంగా అందుకున్న వారిలో సఫారీ బ్యాట్స్ మన్ హషీం ఆమ్లా (40 ఇన్నింగ్స్ లు) ఉన్నాడు.
ఇక భారత్ నుంచి చూస్తే.. ఈ రికార్డును అందుకున్న వారిలో శిఖర్ ధావన్ (48 ఇన్నింగ్స్ లు) తొలి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ (53 ఇన్నింగ్స్ లు), సౌరవ్ గంగూలీ (52 ఇన్నింగ్స్ లు), సిద్ధూ (52 ఇన్నింగ్స్ లు) ఉన్నారు. వీరితో పోలిస్తే కోహ్లీ, గంగూలీ, సిద్ధూల రికార్డును మంధాన (51 ఇన్నింగ్స్ లు) అధిగమించింది. విండీస్ పర్యటనలో నిన్నటి వన్డే గెలిచిన భారత మహిళా జట్టు సిరీస్ ను 2-1తో సొంతం చేసుకోగా, ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా శనివారం ఆతిథ్య జట్టుతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more