అభిమానులను ఉర్రూత లూగించే ఐపీఎల్ క్రికెట్ ఫార్మాట్ ను మరింత రసవత్తరం చేసేందుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) యోచిస్తోంది. కొత్తగా ఆటగాళ్లకు సంబంధించి ‘పవర్ ప్లేయర్’ విధానాన్ని అమల్లోకి తేవాలనుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతీ జట్టు 15 మంది ఆటగాళ్లను ప్రకటిస్తుంది. మైదానంలోకి 11 మంది ఆటగాళ్లు దిగుతారు. మిగతా ఐదుగురిని కూడా ఇరుజట్లు సబ్ స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓ వికెట్ పడిన తర్వాత లేదా ఓవర్ ముగిసిన తర్వాత ఆటగాళ్లను సబ్ స్టిట్యూట్ చేసుకునే వీలుంటుంది. అయితే ఈ కొత్త విధానంపై ఐపీఎల్ పాలన మండలి భేటీలో చర్చించిన అనంతరం అమల్లోకి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
‘ఇక పై ప్రతి జట్టు 11మంది కాకుండా 15 మందిని ప్రకటిస్తుంది. ఇన్నింగ్స్ లో వికెట్ పడగానే లేదా ఓవర్ ముగియగానే ఒకరిని సబ్ స్టిట్యూట్ గా తీసుకోవచ్చు. ఈ పద్ధతిని ఐపీఎల్ లో ప్రవేశపెట్టే ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని చూస్తున్నాము. ఈ కొత్త నిబంధన ఈ ఫార్మాట్ ను మరింత ఉత్కంఠగా మారుస్తుందనటంలో సందేహం లేదు’ అని బీసీసీఐ పేర్కొంది.
ఈ పవర్ ప్లేయర్ విధానంతో మ్యాచ్ మలుపు తిరిగే అవకాశముంటుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు చివరి 6బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో డగౌట్లో (చివరి ఐదుగురు ఆటగాళ్లలో) ఉన్న హిట్టర్ క్రిస్ గేల్ ను ఆ సమయంలో సబ్ స్టిట్యూట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ చేస్తున్నజట్టు పరంగా చూస్తే.. చివరి ఓవర్లో పరుగులేమీ ఇవ్వకుండా ప్రత్యర్థి జట్టును నియంత్రించడానికి డగౌట్ లో ఉన్నబుమ్రాను బౌలర్ గా దించి ఆ ఓవర్ ను వేయించే అవకాశముంటుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more