ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టుకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ చేరాలన్న కలలను ఢిల్లీ నిజం చేసుకోలేకపోయింది. జట్టు ఓడినా సరే.. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం అద్భుతంగా జట్టును నడిపించాడని పాంటింగ్ ప్రశంసించాడు. ‘ఢిల్లీ జట్టుకు గతేడాది అనుభవజ్ఞుడైన గౌతం గంభీర్ కెప్టెన్ గా ఉండేవాడు. అయితే, గంభీర్కు దీటుగా శ్రేయస్ సారథ్య బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడని’ అభినందించాడు.
‘గౌతీ లేని లోటును శ్రేయస్ భర్తీ చేశాడు. గంభీర్ కు నిజమైన వారసుడిగా శ్రేయస్ తనవంతు పాత్ర సంపూర్ణంగా పోషించాడు. తన బాధ్యతను నిర్వర్తించే సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురయ్యేవాడు కాదు’ అని పాంటింగ్ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానంతో ఐపీఎల్ 12వ సీజన్ కు ముగింపు పలికింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గానే గాక ఇటు బ్యాటింగ్లోనూ రాణించాడు. 16 మ్యాచుల్లో 463 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధశతకాలున్నాయి.
అంతకుముందు కోచ్ పాంటింగ్ గురించి కూడా శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘పాంటింగ్.. మాతో ఎంతో సానుకూల దృక్పథంతో ఉండేవారు. ప్రతీ మాట మాలో ఉత్సాహాన్ని నింపేలా మాట్లాడేవారు. కుర్రాళ్లతో నిండి ఉన్న మా జట్టుకు రికీ, గంగూలీ ఇద్దరూ కలిసి ముందుకు ఎలా దూసుకెళ్లాలో నేర్పించారు. పాంటింగ్ కోచ్ గా ఉన్న జట్టులో ఆడటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అతనో లెజెండ్. డ్రెస్సింగ్ రూమ్ లో ఆయన మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడేందుకు ఏమీ ఉండేది కాదు. అనవసరమైన మాటలు ఆయన మాట్లాడరు’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more