వయసు పెరుగుతున్నా టీమిండియా లెజెండరీ క్రికెటర్ ధోనీలో చురుకుదనం ఏ మాత్రం తగ్గడం లేదు. వికెట్ కీపర్ గా ధోనీ చేస్తున్న కళ్లు చెదిరే డిస్మిసల్స్ చూస్తే 'వారెవ్వా' అనాల్సిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్ల బ్యాట్స్ మెన్ కు ఐసీసీ కీలక సూచన చేసింది. 'వికెట్ల వెనుక ధోనీ ఉన్నప్పుడు... క్రీజు దాటి ముందుకు వచ్చే ప్రయత్నం చేయకండి' అని సూచించింది.
న్యూజిలాండ్ తో నిన్న జరిగిన చివరి వన్డేలో ధోనీ మెరుపు వేగానికి కివీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 44 పరుగులతో అప్పటికే నీషమ్ క్రీజులో పాతుకుపోయాడు. కేదార్ జాధవ్ వేసిన బంతిని నీషమ్ మిస్ అయ్యాడు. అయితే, ఆ బంతి నీషమ్ కాలికి తాకడంతో భారత్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. ఇదే సమయంలో నీషమ్ క్రీజు బయటకు వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంతిని అందుకున్న ధోనీ... వికెట్లను గిరాటేశాడు. ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో నీషమ్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో ధోనీని ఎదుర్కోవడం ఎలా అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఐసీసీ సలహా అడిగాడు. ఈ ట్వీట్ పై స్పందించిన ఐసీసీ... ధోనీ వికెట్ల వెనుక ఉన్నప్పుడు... క్రీజును వదిలి వెళ్లవద్దంటూ సూచించింది. అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ ఇప్పటి వరకు 190 స్టంపింగ్ లు చేశాడు. అతని దరిదాపుల్లో కూడా మరెవరూ లేరు. ధోనీ తర్వాత శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (139 స్టంపింగ్ లు) ఉన్నాడు.
Never leave your crease with MS Dhoni behind the stumps! https://t.co/RoUp4iMpX6
— ICC (@ICC) February 3, 2019
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more