నిదహాస్ ట్రోఫీలో భాగంగా రెండో మ్యాచులో బంగ్లాదేశ్ ను ఎదుర్కోన్న టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ గబ్బర్ గా పిలువబడే శిఖర్ ధావన్ తన బ్యాటు నుంచి పరుగుల వరదను సృష్టించడంతో అర్థశతకాన్ని నమోదు చేయడంతో పాటు టీమిండియా విజయతీరాలకు కూడా చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ధేశించిన 140 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా.. అదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయినా ఏమాత్రత తడబాటుకు గురికాకుండా తొలి విజయాన్ని అందుకుంది.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టును తమ పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టారు భారత యువ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, విజయ్ శంకర్. 2.4 ఓవర్ వద్ద 20 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు సౌమ్య సర్కార్ (14) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దానికి మరో 15 పరుగులు జోడించాక మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (15) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాతి నుంచి బంగ్లాదేశ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది.
లిటన్ దాస్ (34), షబ్బీర్ రహ్మాన్ (30) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి భారత్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. దీంతో 140 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (17) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన రిషబ్ పంత్ కూడా నిలదోక్కుకోలేకపోయాడు. అయితే మరో ఎండ్ లో వున్న శిఖర్ ధావన్ మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన బ్యాటుతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కాగా సీనియర్ అటగాడు సురేశ్ రైనా నుంచి అతనికి మంచి సహకారం లభించింది. అర్థశతకం తరువాత ధావన్, రైనాలు కూడా పెవీలియన్ బాట పట్టారు. దీంతో మనీష్ పాండే, దినేష్ కార్తీక్ లు జట్టుకు విజయాన్ని అందించారు. రెండు కీలక వికెట్లు తీసిన విజయ్ శంకర్కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more