టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో క్రికెటర్లు సరికోత్త డిమాండ్ ను బిసిసిఐ ముందు పెట్టి పెట్టగానే జట్టు యాజమాన్యంలో కదిలిక వచ్చింది. క్రికెటర్లకు సంబందించిన అంశంలో తాము సానుకూలంగానే వున్నామని ప్రకటించిన బిసిసిఐ.. ఈ మేరకు న్యూఢిల్లీ వేదికగా జరుగనున్న మూడో టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు అటగాళ్లతో చర్చించి.. వారికి సంబంధించిన డిమాండును పరిష్కరించేందుకు సిద్దంగా వున్నామని బిసిసిఐ కమిటీ అఫ్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు.
ఈ మేరకు ఇదివరకు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తమతో భేటీ అయ్యి క్రికెటర్ల డిమాండ్ అంశాన్ని గతంలోనే చర్చించారని అన్నారు. అయన తమకు దృష్టికి డిమాండ్ను తీసుకోచ్చిన క్రమంలోనే డిమాండ్ ను పరిష్కరించేలా ఒక ప్రణాళికను కూడా తమ ముందు పెట్టారని, దాని అధారంగానే నిర్ణయం తీసుకునే ముందు ఢిల్లీలో జరిగే మూడో టెస్టు సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు క్రికెటర్లతో భేటీ అయ్యిన తరువాత డిమాండ్ పరిష్కారించేలా కృషి చేస్తామని వినోద్ రాయ్ ప్రకటించారు.
ఇంతకీ ఈ డిమాండ్ ఏంటంటారా..? ఆటగాళ్ల కాంట్రాక్టు సంబంధించిన నగదును సవరించాలని ఇవాళ విరాట్ కోహ్లీ బిసిసిఐని డిమాండ్ చేశారు. గత కొంత కాలం నుంచి టీమిండియా తీరికలేని షెడ్యూళ్లతో సిరీస్లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో విశ్రాంతి కావాలని, తాను రోబోను కాదంటూ కోహ్లీ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేయగా, మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, సౌరవ గంగూలీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు మద్ధతు తెలిపారు. ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి నిచ్చారు. అయితే తాజాగా బోర్డు తమ వేతనాలను సవరించాలని టీమిండియా అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు ఆశించడం తెరపైకి వచ్చింది. దీంతో వెనువెంటనే వినోద్ రాయ్ స్పందించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more