అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని మాజీ కెప్టెన్ ధోనిపై వస్తున్న విమర్శలను తప్పుబడుతూ.. అటు జట్టులోని క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్ల నుంచి కూడా పెద్ద ఎత్తు మద్దతు లభిస్తున్న క్రమంలో ఆయన ఇక నెహ్రా అశించినట్లు టీ20 వరల్డ్ కప్ వరకు జట్టులోనే కొనసాగే అవకాశాలే అధికంగా కనబడుతున్నాయి. ఆయనకు లభిస్తున్న మద్దుతు ముందు విమర్శకులు తేలిపోయే పరిస్థితి వుంది. దీంతో ఇప్పటికే విరాట్ కోహ్లి, సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్లు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా వీరి సరసన చేరాడు. అసూయతోనే ధోనిపై కొంతమంది పనిగట్టుకోని విమర్శలు చేస్తున్నారని రవిశాస్త్రి మండిపడ్డారు. వారంతా కుళ్లు.. కుతంత్రాలతో ధోని నాశనం కోసం ఎదురుచూస్తున్నారని ఓ బెంగాళీ స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘కానీ ధోని ఓ దిగ్గజం. అతని కెరీర్ ఎలా మలుచుకోవాలో అతనికి బాగా తెలుసు. ధోని ఓ గొప్ప నాయకుడని కితాబిచ్చాడు. ఆయనోక ఒక సూపర్ స్టార్ అని ప్రశంసించాడు. ఈ వయస్సులో కూడా ఆయన ఇంకా బాగా రాణిస్తున్నాడని, చాలా ఫిట్ గా వున్నాడని అసూయ చెందుతున్న వాళ్లే ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ధోని ఓ అద్బుతమై ఆటగాడు కాబట్టే టీవీ చానళ్లు ధోని సంబంధించిన చిన్న విషయాన్ని కూడా సంచలనం చేస్తున్నాయి. ధోని 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా.. అతిని వన్డే యావరేజ్ 60కి తగ్గలేదని, గత శ్రీలంక, ఆస్ట్రేలియాల సిరీస్ ల్లో మ్యాచ్లను గెలిపించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా సూచించారు. అయితే దీనిని మాజీ టీమిండియా వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ కూడా మద్దతు పలికాడు. ఆయన ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ పై మండిపడ్డాడు. అసలు ధోనిని విమర్శించే ముందు వారి స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నాడు. ధోని దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. టీమిండియాలో ధోనిలాంటి అనుభవజ్ఞుడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more