టీమిండియా పర్యటనలో తగిలిన పాత గాయాలను గుర్తుచేసుకుని తన సమఉజ్జీ అయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని.. టార్గెట్ చేసిన ఆసీస్ జట్టు సారధి స్టీవ్ స్మిత్.. డీఆర్ఎస్ వివాదంపై విరాట్ సహా బిసిసిఐ పిర్యాదు చేస్తే.. ఇప్పటివరకు ఈ విషయమై ఐసీసీ తమపై విచారణను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించాడు. సిరీస్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో స్మిత్ ఔట్ కాగా, అంపైర్ కూడా ఔట్ అని సిగ్నల్ ఇచ్చాడు.
అయితే డీఆర్ఎస్ విధానాన్ని ఎంచుకునేందుకు సిద్దమైన స్మిత్.. అందుకుముందు డ్రస్సింగ్ రూం వైపు చూశాడు. దానిని తప్పుగా పరిగణించిన విరాట్ కోహ్లీ దానిపై అంపైర్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశం కాస్తా అప్పట్లో పెను సంచలనంగా మారింది. డీఆర్ఎస్ కు ముందు క్రికెటర్లు డ్రెస్సింగ్ రూరం వైపు చూడటం తప్పని దిగ్గజ క్రికెట్ మాజీలు కూడా కామెంట్లు చేశారు. తాజాగా ఈ ఘటన గురించి స్మిత్ తన పుస్తకం ‘మై జర్నీ’లో ప్రస్తావించాడు.
‘బెంగళూరు టెస్టు జరిగే సమయంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఆసీస్ క్రికెటర్లు డ్రస్సింగ్ రూమ్ వైపు చూడడం గతంలో తాను చూసినట్లు ఆరోపించాడు. దీనిపై అతడు ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. కోహ్లీ చేసిన ఈ ఆరోపణలన్ని అసంబద్దమైనవి. అవే నిజమైతే కోహ్లీ పిర్యాదును అందుకున్న అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు, ఐసీసీ మమ్మల్ని ప్రశ్నించాలి కదా. ఇప్పటివరకు అదేమీ జరగలేదు. ఇదంతా మ్యాచ్ లో విజయం కోసం కోహ్లీ వేసిన వ్యూహం మాత్రమే అని పేర్కోన్నాడు‘‘.
’’ఇక దీంతో మా జట్టును మానసికంగా దెబ్బ తీస్తే విజయం సాధించవచ్చన్నది కోహ్లీ గేమ్ ప్లాన్. ఈ మ్యాచ్ తర్వాత మేము చాలా సార్లు కలిశాం. కానీ, ఒక్కసారి కూడా మా మధ్య దీని గురించి చర్చ జరగలేదు. మైదానంలో కోహ్లీ దూకుడును నేను ఇష్టపడతా.. కానీ బెంగళూరులో డీఆర్ఎస్ వివాదం మాత్రం పూర్తిగా నిరాధారమైనది. మీడియా సమావేశంలో కోహ్లీ అలా ఎందుకు మాట్లాడాడో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం’ అని స్మిత్ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more