టీమిండియాతో టీ20 మ్యాచ్ సిరీస్ కు ముందుగానే అస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురీత తప్పడం లేదు. ప్రస్తుతం ఆ జట్టుకు ప్రధాన పేసర్ గా సేవలందిస్తున్న ప్యాట్ కమిన్స్.. టీమిండియాతో జరిగే మూడు ట్వంటీ 20 సిరీస్ కు దూరం కానున్నాడు. త్వరలో యాషెస్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ కు విశ్రాంతి నివ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీమిండియాతో టీ 20 సిరీస్ నుంచి అతన్ని తప్పించింది. భారత్ తో నాగ్పూర్ లో జరిగే చివరి వన్డే తరువాత కమిన్స్ స్వదేశానికి పయనం కానున్నట్లు క్రికెట్ అస్ట్రేలియా వెల్లడించింది.
గతంలో ఇదే తరహా నిర్ణయాన్ని మిచెల్ జాన్సన్ విషయంతో తీసుకున్న క్రికెట్ అస్ట్రేలియా.. ఆ తరువాత యాషెస్ సిరీస్ లో అతను ఏకంగా 37 వికెట్లను తీసుకున్నారు. దీంతో అదే తరహాలో ప్యాట్ కమిన్స్ కూడా విశ్రాంతిని కల్పించిన పక్షంలో అతను కూడా యాషెస్ సిరీస్ లో ప్రత్యర్థుల వికెట్లను తీసుకోవడంలో సఫలీకృతుడవుతాడని భావించి ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది.
కమిన్స్ కు భారత్ తో జరిగే ట్వంటీ 20 సిరీస్ నుంచి విశ్రాంతిని కల్పిస్తున్నాం. అతన్ని సాధ్యమైనంత వరకూ గాయపడకుండా చూసుకోవడం తమ బాధ్యత అని చెప్పుకోచ్చారు. మా బాధ్యత. దానిలో భాగంగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని తమకు సెలక్టర్లు నిర్ణయించారని సీఏ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ లో ఆరంభమయ్యే షెఫల్డ్ ఫీల్డ్ సీజన్ కు నూతనోత్తేజంతో బరిలోకి దింపాలనే యోచనలో భాగంగానే అతనికి విశ్రాంతిని కల్పిస్తున్నాం. వన్డే సిరీస్ తరువాత కమిన్స్ ఆసీస్ కు వెళతాడని సీఏ స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more