యువరక్తంతో పరుగులు పెడుతున్న ప్రస్తుత టీమిండియా జట్టు 2019లో ప్రపంచకప్ గెలచి విశ్వవిజేతగా మరోమారు నిలుస్తుందని యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఏడు నెలల అనంతరం జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ తొలి మ్యాచులోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచులో అక్షర్ పటేల్ మూడు వికెట్లను పడగొట్టి తన సత్తా చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు జస్ప్రీత్ బుమ్రాతో ఈ యువ క్రికెటర్ సరదాగా ముచ్చటించాడు.
బుమ్రా విలేకరిగా మారి అడిగిన పలు ప్రశ్నలకు అక్షర్ పటేల్ చలాకీగా, చాకచక్యంగా సమాధానాలు చెప్పాడు. అవేంటో ఆయన మాటల్లోనే.. చాల రోజుల తర్వాత జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. కానీ జట్టులో అవకాశం లభించలేదని ఎప్పుడు దిగులు చెందలేదు. శ్రీలంక బ్యాట్స్ మన్ దాటిగా ఆడుతున్నప్పుడు బౌలింగ్ అవకాశం వచ్చింది. నేను కుదురుకోవడానికి రెండు ఓవర్లు వేయాల్సి వచ్చింది. అనంతరం ఖచ్చితంగా వికెట్ తీయాలనుకున్నా అలాగే నాకు తొలి వికెట్ దక్కింది.’ అని గేమ్ ప్లానింగ్ గురించి బుమ్రా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్షర్ చెప్పుకొచ్చాడు.
ఇక శిఖర్ ధావన్ ను కొనియాడిన ఈ యువ బౌలర్ ధావన్ చక్కగా తాను నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరకున్నాడని అన్నారు. కాగా, ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా సమీష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధించామన్నాడు. జట్టులో ఆటగాళ్లందరూ 25 నుంచి 27 మధ్య వయస్సు వారే ఉన్నారు. అంతే కాకుండా జట్టు ఐక్యంగా ముందుకు వెళ్తూ విజయాలు సాధిస్తుంది. 2019 ప్రపంచ కప్ ఈ యవ భారతజట్టుదే అని అక్షర్ జోస్యం చెప్పాడు. శ్రీలంకతో భారత్ రెండో వన్డే గురువారం పల్లెకలెలో ఆడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more