టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రపంచం యావత్తు ప్రశంసల జల్లు కురిపిస్తున్న క్రమంలో.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలను చేశాడు. భారత దిగ్గజ క్రికెటర్లైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లతో కోహ్లీని పొల్చడం సరికాదని అన్నాడు. సచిన్, ద్రావిడ్ లు క్రికెట్ ప్రపంచంలోనే దిగ్గజాలని.. వారు నూటికి నూరు శాతం ఫర్ఫెక్షనిస్లులని కొనియాడారు. అయితే కోహ్లీ క్లాస్ బ్యాట్స్ మెన్ అని అంగీకరించాడు యూసుప్.
అయితే ఎవరు క్రికెట్ లోరాణిస్తే వారిని దిగ్గజాలతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. సచిన్, ద్రవిడ్ లు తమ సమయంలో క్లిష్టమైన బౌలర్లను ఎదుర్కొని దిగ్గజ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారని.. ఈ నేపథ్యంలో కోహ్లిని వారితో పోల్చకూడదని యూసఫ్ అన్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ తో పోల్చదగిన స్థాయి కూడా విరాట్ కోహ్లీ ఇప్పటికీ అర్జించలేదని చెప్పాడు. ప్రస్తుత క్రికెట్ లో నాణ్యత కొరవడిందని.. మరీ ముఖ్యంగా నాణ్యమైన బౌలర్లే ప్రస్తుతం కనిపించడం లేదని అన్నారు.
తాను క్రికెట్ ఆడిన సమయంలో బౌలింగ్ లో క్వాలిటీ ఉండేదన్నాడు. బ్యాట్స్ మెన్లు ఎంతటి దిగ్గజాలైనా.. బౌలర్లు కూడా అదే స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగారని అన్నాడు. అయితే తాజా పరిస్థితులలో బౌలింగ్ దిగ్గజాలు కనిపించడం లేదని పేర్కోన్నాడు. ఈ సందర్భంగా మెక్ గ్రాత్, షేన్ వార్న్ లతో పాటు, భారత్ లో అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ లను యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. వారు అద్భుతమైన బౌలర్లని కొనియాడాడు. మరొకవైపు ప్రస్తుత పిచ్ లన్నీ ఫ్రెండ్లీ పిచ్ లని.. అవి బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తాయన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more