టీమిండియా మహిళల జట్టు సారధి మిథాలీ రాజ్.. టాప్ బ్యాట్స్ వుమెన్ జాబితాలో ఎగబాకింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకుల జాబితాలో టాప్ స్థానాన్ని అక్రమించేందుకు పోటీ పడింది. అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లాన్నింగ్ తో పోటీ పడిన మిథాలీ.. కేవలం ఐదు పాయింట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 779 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న లాన్నింగ్ కు మిథాలీ చేరువలోనే ఉంది. ఇద్దరి మధ్య కేవలం 5పాయింట్ల తేడా మాత్రమే ఉంది. మిథాలీ తప్ప టాప్-10లో ఏ ఒక్క భారత క్రికెటర్కి చోటు దక్కలేదు.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సంపాదించడంతో పాటు మిథాలి మరో అరుదైన ఘనత సాధించారు. మహిళల వరల్డ్ కప్ లో వెయ్యి పరుగులు మార్కు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా అమె నూతన రికార్డును నమోదు చేశారు. ఇంగ్లాండ్, వేల్స్లో జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో వరుస విజయాలతో జట్టును సెమీస్ చేర్చారు. అత్యంత కీలకమైన మ్యాచ్ లో అమె కెప్టెన్ ఇన్నింగ్స్ అడి 109 పరుగులను సాధించి భారత్ జట్టుకు సెమీస్ బెర్తును ఖారారు చేశారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో మిథాలీ 356 పరుగులు సాధించింది. ఇక బౌలింగ్ విభాగంలో జులన్ గోస్వామి, ఎక్తా బిస్త్ తమ ర్యాంకులను దిగజార్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more