మహిళల వన్డే ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా మహిళల జట్టు సరికొత్త రికార్డును తన పేరును లిఖించుకుంది. టీమిండియా మహిళ జట్టు కెప్టెన్ మిధాలి రాజ్ సహా సభ్యలలందరికీ ఈ ఘనత దక్కింది. పటిష్టమైన ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టు శుభారంభం చేసింది. అయితే భారత్ జట్టు విజయంతో పాటు అరుదైన ఈ ఘనతను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టిన తరువాత దాన్ని ఉపయోగించిన తొలి జట్టుగా రికార్డులెక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మహిళల క్రికెట్ లో డీఆర్ఎస్ను వినియోగించిన మొదటి జట్టుగా భారత్ నిలిచిన విషయాన్ని స్పష్టం చేశారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా దీప్తిశర్మ వేసిన 18ఓవర్ తొలి బంతిని ఇంగ్లండ్ బ్యాట్స్వుమన్ నాటలీ స్క్రివర్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించారు. అది ఆమె గ్లోవ్స్ ను తాకి భారత వికెట్ కీపర్ సుష్మా వర్మ చేతుల్లో పడింది. దీనిపై అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించారు. దాంతో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ డీఆర్ఎస్ను ఆశ్రయించి సక్సెస్ అయ్యారు. తద్వారా మహిళల క్రికెట్ లో డీఆర్ఎస్ ను తొలిసారి వినియోగించుకోవడమే కాకుండా, సక్సెస్ అయిన మొదటి జట్టుగా కూడా భారత్ గుర్తింపు సాధించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more